సాహూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళలో ఒత్తులు పెట్టుకొని మరీ వేచి చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే సినిమా కూడా భారీ బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో తెరకెక్కించడంలో చిత్ర యూనిట్ కూడా పూర్తిగా సక్సెస్ అయ్యింది.  బాహుబలి2 తర్వాత ప్రభాస్  గురించి ఏ చిన్న వార్త బయటకి వచ్చిన అది ట్రెండ్ అయ్యింది. ప్రభాస్ పెళ్లి, నెక్స్ట్ సినిమా.. ఇలా ప్రతీది వైరల్ అవుతూ వచ్చింది .  

టాలీవుడ్ యువ దర్శకుడు  సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిచింది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మరోసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన నటించింది. గతంలో ఏనిరంజన్ లో కంగనా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. అలాగే సాహో నుండి వచ్చిన ప్రతి ఒక్క టీజర్ , ట్రైలర్ తో మొదలుపెట్టుకొని పాటలు , పోస్టర్స్ అన్ని కూడా విపరీతంగా అభిమానులని ఆకట్టుకోవడంతో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

అలాగే ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఒకేసారి తెలుగు తమిళం , మలయాళం , హిందీలో తెరకెక్కించడంలో అన్ని భాషల్లో హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ఇంటర్వూస్ ఇస్తూ సినిమా కి కావాల్సినంత హైప్ తీసుకోని వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ్ లో ఒకేరోజు ప్రభాస్ 20 ఇంటర్వూస్ ఇచ్చాడు అంటేనే అర్థం చేసుకొవచ్చు ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో. ప్రభాస్ ఇంటర్వూస్ లో మాట్లాడే విధానం చూస్తుంటే అసలు మాట్లాడేది మన డార్లింగ్ ప్రభాషే నా అనిపించకమానదు.

ఇకపోతే అనుష్క , ప్రభాస్ గురించి ఇండస్ట్రీ లో ఎటువంటి రూమర్స్ ఉండేది అందరికి తెలిసిందే. అలాగే ఆన్ స్క్రీన్ ప్రభాస్ , అనుష్క రొమ్యాన్స్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. అనుష్క తో ప్రభాస్ నటించిన మిర్చి , బాహుబలి 1 , 2 ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో అందరికి తెలిసిందే. దీనితో సెంటిమెంట్ గా భావించిన ప్రభాస్ సాహో లో కూడా అనుష్క కి రికమెండ్ చేసిమరీ ఒక చిన్న రోల్ ఇప్పించాడు. అసలు సాహో లో అనుష్క ఉంది అని సినిమా రిలీజ్ వరకు ఎవరికీ తెలియకుండా మ్యానేజ్ చేయాలనీ మొత్తం భావించారు. సినిమా ఫ్రీ క్లైమాక్స్ లో , హీరోయిన్ శ్రద్దా చనిపోయిన తరువాత ఆమె స్థానంలో అనుష్క ఎంట్రీ  ఇస్తుంది. ఈ సీన్ కి థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయం అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: