మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాహో మూవీ తెరపైకి రాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మానియా మొదలైంది. సాహో సినిమా కోసం చాలా సినిమాలు పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా సరే అది వైరల్ గా మారుతున్నది. ఈ సినిమా గురించి హీరోయిన్ శ్రద్దా కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన గురించి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది.
సినిమా రిలీజ్ అయ్యే రోజున తన తల్లిని గట్టిగా పట్టుకొని కూర్చుంటానని చెప్పిన శ్రద్దా కపూర్.. స్టార్ కూతురిగా అవకాశాలు రాలేదని, ఆడిషన్స్ కు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. 16 సంవత్సరాల వయసులో ఒకసారి అవకాశం వచ్చినా పక్కన పెట్టినట్టు శ్రద్దా కపూర్ పేర్కొన్నది. ఆ తరువాత అమితాబ్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పేసుకుంది.
ఇదిలా ఉంటె, తనకు పేరు తెచ్చి పెట్టిన సినిమా ఆషీకీ 2.. ఈ మూవీ ఆమె ఫస్ట్ సినిమా అనుకుంటారు. కానీ అంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ఇకపోతే, ప్రభాస్ తో చేస్తున్న సాహో ద్వారా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నది ఈ హీరోయిన్. టాలీవుడ్ తనకు రెండో ఇల్లు అని చెప్పిన శ్రద్దా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో ఇబ్బందులు పడకుండా నటించదట.
యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో ఆమెకు మంచి ట్రైనింగ్ ఇచ్చారట. చాలా కష్టపడి స్టంట్స్ నేర్చుకున్నది. నేర్చుకున్న దాన్ని అప్లై చేసింది. చేసినట్టుగా మెప్పించింది. ఇక ప్రభాస్ గురించి అనేక విషయాలు చెప్పింది. ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వ్యక్తి అని, షూటింగ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే వాటికి సొల్యూషన్ చెప్తారని.. ప్రభాస్ తో కలిసి తొలి తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉందని అంటోంది శ్రద్దా కపూర్. తెలుగులో మంచి ఆఫర్లు దొరికితే తప్పకుండా చేస్తానని చెప్తోంది.