‘ఫిదా’ సూపర్ సక్సస్స్ తో సాయి పల్లవి  క్రేజ్ విపరీతంగా పెరిగి పోవడంతో ఆమెతో సినిమాలు తీయడానికి అనేఖ ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టి అనేకమంది టాలెంట్ డైరెక్టర్స్ ను ఆమె వద్దకు క్యూ కట్టించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఆమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదగవలసిన ఈమె ఆ రేంజ్ కి ఎదగలేకపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

దీనికితోడు అనేకమంది దర్శకులు ఎవరు కథ చెబుతామని వెళ్లినా టైమ్‌ ఇవ్వడం లేదనీ ఒకవేళ కథ విన్నతరువాత ఆ కథలో తనకు ప్రాధాన్యత లేదు అంటూ ఆమె వరసపెట్టి కథలు రిజిక్ట్ చేయడంతో ఆమెకు కథలు చెప్పడానికి కూడ ఇప్పుడు కొందరు యంగ్ దర్శకులు భయపడిపోతున్నారు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

అంతేకాదు తనను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ఓరియంటెడ్ కథలు వ్రాయామని హీరోల ప్రాముఖ్యత తన సినిమాల విషయంలో తగ్గించమని సాయి పల్లవి తన దగ్గరకు వస్తున్న దర్శకులకు పరోక్షంగా సూచనలు ఇస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో సాయి పల్లవి తన కెరియర్ స్లంప్ లో ఉందని తెలిసి కూడ ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెడుతోంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

గతంలో నిత్యామీనన్ కు మంచి ఇమేజ్ ఏర్పడినా ఇలాగే తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలతో తలతిక్కగా ప్రవర్తించడం వల్ల ఆమె అనేక అవకాశాలు కోల్పోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నిత్యామీనన్ చేసిన తప్పులే సాయి పల్లవి కూడ చేస్తూ అనవసరంగా ఆమె తనకు వస్తున్న అవకాశాలను దూరం చేసుకుంటోంది అంటూ కొందరు కామెంట్స్ చేయడమే కాకుండా సాయి పల్లవికి లౌక్యం తెలియదు అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: