కబాలి సినిమా తరువాత రజినీకాంత్ వరసగా సినిమాలు చేస్తున్నారు. కబాలి, కాలా, 2పాయింట్ 0, పేట వరసగా వచ్చాయి. ఈ నాలుగు యావరేజ్ గా నిలిచినా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము రేపాయి. ఏ సినిమా కూడా కమర్షియల్ గా ఫెయిల్ కాలేదు. అయితే, ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. గతంలో ఈ సినిమా టైటిల్ ను అలానే సినిమా కు సంబంధించిన కొన్ని ఫోటోలను యూనిట్ రిలీజ్ చేసింది. ఆ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ ఓ సీరియస్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ఫోటో అది.
సడెన్ గా ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో మురుగుదాస్ షాక్ అయ్యాడు. ఈ ఫోటోను లీక్ చేసిన వారిపై సీరియస్ అవుతున్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదే సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. కాలంతో పాటు క్రైమ్ విధానం కూడా మారిపోయింది. కాలం చెల్లిన చట్టాలతో పోలీసులు పెరుగుతున్న క్రైమ్ ను, అరాచకాలను ఆపలేకపోతున్నారు.
దీంతో రజినీకాంత్ తనదైన స్టైల్ లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి.. క్రైమ్ చేస్తున్న వాళ్ళను ఎలా పట్టుకున్నాడు.. క్రైమ్ ను ఎలా ఆపగలిగాడు అన్నది కథ. థ్రిల్లింగ్ గా ఉండే విధంగా సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మురుగదాస్ తనదైన స్టైల్ లో స్క్రీన్ ప్లే ను జోడించి సినిమాను సెట్ చేశారట. దర్బార్ స్టోరీ ఇదే అని సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఆంతా షాక్ అవుతున్నారు. నిజంగా దర్బార్ స్టోరీ అదేనా కాదా అని తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. నయనతార మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నది.