అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన నాచురల్ స్టార్ నాని హీరోగా, టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఇష్క్, 24, హలో సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ఇటీవల ఈ సినిమాకు సంబందించిన రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు లిరికల్ సాంగ్స్ కూడా అదరగొట్టడంతో, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. 

ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు ఒక వెరైటీ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఒక ఇంగ్లీష్ మూవీలోని సీన్ వస్తుండగా, 'నేను చెప్తున్నాను అది నిజం కావాలి.. ఇట్లా ఇట్లా రాయాలి, కాదు ఇదే రాయాలి' అంటూ నాని పలికే ఫన్నీ డైలాగ్ తో ఈ ట్రైలర్ ఆరంభం అవుతుంది. '28 ఫ్రెంచ్ కథలు రాసాడంటే, అతని ఆలోచనలో ఎంత పగ ఉండి ఉంటుంది', వంటి డైలాగ్స్,  'యుద్దానికి సిద్ధం కండి, సమరశంఖం నేను ఊదుతా'

ఇక చివరిగా 'రేయ్ నేను ఇంకా థ్రిల్లర్ జానర్ లోనే ఉన్నా, సైకో కిల్లర్ జానర్ లోకి వెళ్ళేలోపు మొదలెట్టేద్దాం' అని ట్రైలర్ లో నాని పలికే డైలాగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ మరియు థ్రల్లింగ్ సన్నివేశాలతో సాగింది, ట్రైలర్ ని బట్టి ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో, ఫన్నీ, యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఓవర్ ఆల్ గా ఈ గ్యాంగ్ లీడర్ ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెంచేసిందనే చెప్పాలి. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, ఆర్ఎక్స్100 కార్తికేయ, శరణ్య మోహన్, ప్రియదర్శి, అనీష్ కురివిల్లా, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటిస్తుండగా, అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కాయక్రమాలు పూర్తి చేసి, సినిమాను వచ్చే నెల 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: