పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రీతూ వర్మ. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. ఈసినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ తో పాటు రీతూ వర్మ కుకూడా మంచి పేరొచ్చింది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ వరుసగా అవకాశాలు సంపాదించుకోగా రీతూ వర్మ కు మాత్రం నిరాశనే ఎదురయ్యింది. పెళ్లి చూపులు తర్వాత రీతూ వర్మ, కేశవ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఇక ఆ సినిమానే తెలుగులో ఆమె చివరగా చేసింది. ఆ తరువాత రీతూ తమిళం లో ధనుష్ 'వీఐపీ 2' లో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఉపోయోగపడలేదు. కాగా ఆమె ప్రస్తుతం మలయాళం లో దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమాలో నటించింది. ఆ చిత్రం విడుదలకావాల్సి వుంది. ఇక ఇదిలా ఉంటే ఇక ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది రీతూ వర్మ. ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తో శ్రీ కార్తీక్ ఓ సినిమా తెరకెక్కించనున్నాడు.
ఈ చిత్రం ఈ రోజే లాంచ్ అయ్యింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, శర్వా కు జోడీగా నటించనుంది. ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా టాక్సీవాలా ఫేమ్ జెక్స్ బిజోయ్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రానికి పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు రాస్తుండడం విశేషం. మరి ఈ చిత్రమైన రీతూ వర్మ కు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.