టాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీస్ దర్శకత్వం వహించిన హరీష్ శంకర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో దువ్వాడ జగన్నాధం సినిమాతో మంచి విజయం అందుకున్నారు. చాలా కాలం తర్వాత హరీష్ శంకర్ మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ - అధర్వమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది.

ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.  ఈ మద్య వస్తున్న సినిమాలు మొదట ఓ డేట్ ఫిక్స్ చేసినా తర్వాత సమయానుకూలం కాకపోవడంతో డేట్ మారుస్తూ వస్తున్నారు. ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించినప్పటికీ చిత్ర యూనిట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజింగ్ డేట్ మార్చింది. కొత్త విడుదల తేదీని కొంతసేపటి క్రితం ప్రకటించారు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే 13 న నాని నటించిన గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా ద్వారా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అసలే టాలీవుడ్ లో నానికి మంచి మార్కెట్ ఉంది.

ఇలాంటి సమయంలో పోటీ ఎందుకు అని భావించిన వాల్మీకి టీమ్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినట్లు అనిపిస్తుంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'జిగర్తాండ' సినిమాకి ఇది రీమేక్. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: