‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.330 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ పేరు అశోక చక్రవర్తి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో జాకీ ఫ్రాఫ్,నీత్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే,మందిరా బేడి,అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.
ఇదిలా ఉంటే... ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అదేమిటంటే డైరెక్ట్గా తనను కలుసుకునే అవకాశం. డైరెక్ట్గా తనను కలిసే ఛాన్స్ మీ సొంతం అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తనను కలవాలనుకున్న అభిమాని సాహో పోస్టర్తో ఒక సెల్ఫీ దిగి, ఆ ఫొటోను తన ఇస్స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చెయ్యాలని బాహుబలి సూచించాడు. ఇందులో లక్కీ విన్నర్స్ని ఎంపిక చేస్తామన్నాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇక మాములుగా ఊరుకుంటారా. ఇన్స్టాగ్రామ్ మొత్తం వాళ్ల సెల్ఫీలతో నింపేస్తున్నారు. అసలే ప్రభాస్ పైగా తనతో ఫొటో దిగే అవకాశం అంటే ఎవరన్నా ఒదులుకుంటారా. ఇకపోతే ఫ్యాన్స్ చూపే అభిమానం అంటే తనకు చాలా ఇష్టమని వారిని కొట్టలేను ఫ్యాన్స్ తన దగ్గరకు వస్తే తోసేయలేనని ఈ సందర్భంగా తెలిపారు. తన సెక్యూరిటీ ఇలా చేసినా ఇబ్బందిగా భావిస్తానని తెలిపాడు. ఇక ఎన్ని హిట్లు వచ్చినా సాధారణంగా ఉండడం రాజమౌళి నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. సాహో ట్రైలర్ చూసి చిరంజీవి ఫోన్ చేసి తన సొంత సినిమాలా ప్రశంసిస్తూ మాట్లాడటం బాగా అనిపించిందన్నాడు. ఇకపోతే ఇదంతా సినిమా క్రేజ్ కోసమా అని కొందరు భావిస్తున్నారు.