మరో 42 గంటల్లో సాహో సినిమా ఫలితం తేలిపోనుంది. సాహో సినిమాకు హిట్ టాక్ వాస్తే చాలు ఇప్పటివరకు టాలీవుడ్లో ఉన్న రికార్డులు బద్దలయ్యేలానే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్లో భారీ స్థాయిలో సాహో సినిమా విడుదల కాబోతుంది. 320 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన సాహో సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో కలిపి 150 కోట్ల రుపాయలకు అమ్ముడయ్యాయి. 
 
కానీ సాహో సినిమాను కొన్ని అంశాలు మాత్రం టెన్షన్ పెడుతున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై బాగానే అంచనాలు పెంచినప్పటికీ ఈ సినిమా మాస్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. కానీ విజువల్స్ పరంగా మాత్రం ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో కామెడీ ఉంటుందా లేదా అనే విషయం కూడా తెలియట్లేదు. 
 
ప్రీ రిలీజ్ టాక్ ప్రకారం సాహో సినిమా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంటుందని తెలుస్తుంది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో పాటు సినిమా ఎమోషనల్ గా కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. 
 
ఈ సినిమా తరువాత ప్రభాస్ యువి క్రియేషన్స్ బ్యానర్లో జాన్ అనే సినిమాలో నటించబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మాతలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: