మహేష్ బాబు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు రెండు అందుకున్నాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జమ్మూకాశ్మీర్లో మరియు కర్నూలు ప్రాంతాల్లో చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే మహేష్ బాబు తో కొరటాల సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


అయితే ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే కొరటాల శివ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'గీతా గోవిందం' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. గతంలోనే డైరెక్టర్ పరుశురాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో పరుశరామ్ చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తవడం జరిగింది.


దీంతో ఈ సినిమాని సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ అయిన వెంటనే స్టార్ట్ చేసి రాబోయే సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున సినిమాని విడుదల చేయాలని మహేష్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మాత్రం రాబోయే సంక్రాంతికి విడుదల కానుంది. ఇంకో విశేషమేమిటంటే, పరశురామ్ ప్రాజెక్టు తరువాత కొరటాల శివతోనే కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. అంటే ముందు నిర్మాతగా .. ఆ తరువాత దర్శకుడిగా మహేశ్ బాబు కాంబినేషన్లో కొరటాల శివ సినిమాలు రానున్నాయన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: