గత కొద్ది రోజులుగా మనందరం సాయి పల్లవి వదులుకున్న చిత్రాల లిస్టు చూస్తూనే ఉన్నాం. ప్రతీసారి ఎవరు కథ చెబుదామని వెళ్ళినా వారికి టైమ్ ఇవ్వడం, రెండు మూడేసి గంటలు కథ విని ఇందులో హీరోయిన్ పాత్ర పెద్దగా ఏమీ లేదని చెప్పి దానిని రిజెక్ట్ చేయడం ఆమెకు రివాజు గా మారిందని ఇండస్ట్రీలో అందరూ కస్సుబుస్సులాడుతున్నారు. ఒక్కోసారి గంటల తరబడి పూర్తి కథ విన్న తర్వాత కూడా అసలు కథే బాగా లేదని ఆమె అన్నట్లుగా చెబుతున్నారు. ఇలా ఆమె పోగొట్టుకున్న సినిమాలు ఎన్నో.

టాలీవుడ్ లో ఎక్కువగా హీరోకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు వస్తుంటాయి. ఈ విషయం సాయి పల్లవి కూడా తెలుసు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్ కు ప్రాధాన్యత ఉండే కథలు అయిన వస్తున్నాయి కానీ కొన్ని సంవత్సరాల క్రితం అయితే అసలు కేవలం గ్లామర్ కోసమే మెజారిటీ చిత్రాల్లో హీరోయిన్లను పెట్టేవాళ్ళు. సాయి పల్లవి తో చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా మార్కెట్ ఉంటుందని ఆమె నిర్మాతలు సంపాదిస్తున్నాడు. అయితే ఎంత పెద్ద నిర్మాత అయినా కూడా సాయి పల్లవి వారిని తిప్పి పంపించేస్తోందట.

మొన్నటికి మొన్న ఒక సినిమా అంతా బాగున్నా ఆ సినిమాలో లిప్ లాక్ అనివార్యం అని చెప్పడంతో ఆమె ఏకంగా ప్రాజెక్టు వదిలేసుకుంది అట. సాయిపల్లవి ఇలా లౌక్యం చూపించకుండా నిర్మాతలను ఇరిటేట్ చేస్తోందని ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు. అప్పుడు వచ్చిన 'మారి 2' నుండి మొన్న వచ్చిన 'పడి పడి లేచే మనసు' వరకు వరుస ఫ్లాపులతో ఆమె సినిమాలకు మునుపటి మాదిరిగా ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. కానీ ఆమె నిర్మాతలని అసలు కన్సిడర్ చేయని వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఒక టైంలో ఆమె అంటే ఇష్టం ఉన్న అభిమానులు కూడా మెల్ల మెల్లగా ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఇలా చేస్తూ పోతే చివరికి ఆమె కూడా నిత్యామీనన్ లాగే అయిపోతుందని అంతా హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: