మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అసలు బన్ని మూవీ, దేవీ శ్రీ మ్యూజిక్ అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే రేంజ్ కి వీరిద్దరి జోడీ పాపులర్ అయ్యింది.  ఒకప్పుడు అల్లు అర్జున కూడా తన మూవీకి దేవీ అయితేనే బాగుంటుందన్న సలహాలు కూడా ఇచ్చేవాడని టాక్ వినిపించేది. వ్యక్తిగతంగా కూడా దేవి అంటే బన్నీకి చాలా ఇష్టం. ఇద్దరూ స్నేహపూర్వకంగానే మెలుగుతుంటారు.

దాదాపు ఇద్దరిదీ ఒకే వయసు కావడంతో వీరి మద్య మంచి స్నేహ సంబంధాలు కూడా కొనసాగాయి.  కానీ ఇప్పుడు అల్లు అర్జున్,  దేవిశ్రీప్రసాద్ ని దూరం పెడుతున్నాడని సమాచారం. గతంలో దేవీలో ఉన్న జోష్ ఇప్పుడు లేదని బన్నీ అభిప్రాయపడుతున్నాడని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  కాపీ వివాదాలు, తమ సినిమాలన్నింటికీ ఒకేరకమైన పాటలుంటాయనే విమర్శలు ఎక్కువ అవడంతో దేవిశ్రీ ప్రసాద్ పని పట్ల బన్నీకి ఆసక్తి తగ్గినట్లుంది. అయితే ఆ మద్య వక్కంతం వంశి దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ సినిమాలో దేవిని కాదని  విశాల్ శేఖర్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు బన్ని. 

ఇప్పుడు త్రివిక్రమ్-బన్ని కాంబినేషన్ లో వస్తున్న అలా వైకుంఠపురం సినిమాలో తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి లాంటి సినిమాల్లో దేవీ నే మంచి మ్యూజిక్ అందించాడు.  త్రివిక్రమ్ తర్వాత బన్ని నటిస్తున్న 'ఐకాన్' సినిమాకి కూడా అనిరుద్ ని ఫైనల్ చేసుకున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే బన్నీ ఇప్పట్లో దేవిశ్రీప్రసాద్ తో కలిసి పనిచేసేలా కనిపించడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: