యావత్ భారతదేశం సాహో ఫీవర్ తో ఊగిపోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ సాహో ...సాహో అంటూ సాహో నామస్మరణ చేస్తున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు ఎక్కడ చూసినా సాహో హంగామానే కనిపిస్తోంది. ఓ రీజనల్ హీరో నటించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అంటే... ఈ సినిమాలో నటించిన ప్రభాస్ నిజంగా అదృష్టవంతుడు అని చెప్పాలి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక బ్యాడ్ బాయ్ అనే ఐటెం సాంగ్లో విదేశీ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రభాస్తో ఆడిపాడింది. ఈ పాటలో నటించేందుకు ఆమెకు నిర్మాతలు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తాజాగా రివీల్ అయింది. అయితే స్పెషల్ సాంగ్ మంచి అవకాశాన్ని టాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మిస్ చేసుకుందట.
కాజల్ ఈ ఒక్క సాంగ్లో నటించేందుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో... చిత్రయూనిట్ సభ్యులు ఆమె కంటే నేషనల్ క్రేజ్ ఉన్న జాక్విలిన్ అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు కాజల్కు ఇటీవల ఛాన్స్ ఇచ్చే నాథుడే కరువయ్యాడు. బెల్లంకొండ లాంటి మార్కెట్ లేని హీరోల సినిమాల్లో వరుసగా కవచం, సీత అంటూ కాలం నెట్టుకొచ్చేస్తోంది.
ఇలాంటి టైంలో సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ వస్తే డబ్బు ఆశతో వదులుకోవడం ఆమెకే చెల్లిందన్న విమర్శలు వస్తున్నాయి. సాహోలో ఐటమ్ సాంగ్ చేసి ఉంటే ఒక గొప్ప సినిమాలో నటించిన అనుభూతి ఆమెకు ఎప్పటికి మిగిలి ఉండేది. ఈ సాంగ్లో ఆమె నటించి ఉంటే నేషనల్ వైడ్గా కాజల్ పేరు మార్మోగిపోయి ఉండేది.