కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఆరోవారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోవారం ఎలిమినేషన్‌కి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ కాగా.. వీరిలో ముగ్గుర్ని సేవ్ చేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కొరకు ఎంపికైన హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ నుండి ముగ్గురు సేవ్ చేయబడ్డారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వహించిన సీక్రెట్ టాస్క్ వలన సింగర్ రాహుల్, హీరో వరుణ్ సందేశ్, సీరియల్ నటుడు రవి కృష్ణ లకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం లభించింది. నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ముగ్గురు సేఫ్ జోన్ కి ప్రవేశించడంతో ఈవారం ఎలిమినేషన్ కి గాను కేవలం ముగ్గురే మిగిలారు.


మహేష్ విట్టా, పునర్నవి, హిమజ లలో ఒకరు ఈవారం షో నుండి బయటకి వెళ్లనున్నారు. మరి ఈ ముగ్గురిలో ఈ వారం ప్రేక్షకులు ఎవరిని బిగ్ బాస్ ఇంటి నుండి తమ ఇంటికి పంపిస్తారో చూడాలి. ఇప్పటివరకు జరిగిన ఐదు వారాలకి గాను, హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, ఆషురెడ్డి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ చేయబడ్డారు.
ఇక మిగిలిన మహేష్ విట్టా, శివజ్యోతిలు ఈ ఎలిమినేషన్ జోన్ నుండి బయటపడటం కష్టంగా మారింది. మహేష్ విట్టాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ హౌస్‌లో పుల్లలు పెడుతున్నారంటూ అతన్ని పుల్లల మహేష్‌గా మార్చేశారు బిగ్ బాస్. ఇవ శివజ్యోతి కూడా రేటింగ్స్ మెరుగుపరిచే పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఐదోవారం ఎలిమినేషన్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే.. ఎక్కువ ప్రమాదం మహేష్ విట్టా, శివజ్యోతిలకే ఉంది. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ చేస్తే.. శివజ్యోతిని ఇంటికి పంపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


నామినేట్ కాకుండా ఉన్నవారిలో శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, వితికా షెరు ఉండగా.. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శివజ్యోతిని డైరెక్ట్‌గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరగా... ఆమె వరుణ్ సందేశ్‌ను నామినేట్ చేసింది. దీంతో ఆరోవారం నామినేషన్‌లో వరుణ్‌తో కలిపి ఆరుగురు నామినేట్ అయ్యారు. నాలుగు రోజుల తరువాత వచ్చే ఆదివారం నాడు వీరిలో ఒకరు షో నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: