రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇండియాలోనే అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. తెలుగుతో పాటు ఇండియాలోని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి కథ, కథనాలు, అలానే సన్నివేశాలకు ఇలా ఉండబోతున్నాయంటూ, పలు మీడియా మాధ్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. సినిమాలో ట్విస్టులు ఉన్నాయని, అలానే ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని, 

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది అంటూ ఇప్పటికే ప్రచారం అవుతున్న ఈ పుకార్లకు తోడు, నేడు ఆ సినిమాకు సంబంధించి ఒక నెగటివ్ పాయింట్ వినపడుతోంది. ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే సన్నివేశాలు లేవని, కేవలం మాస్ మరియు యూత్ కి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం కనపడుతోందనేది ఆ వార్త యొక్క సారాంశం. ఆ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు చాలావరకు దూరమేయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి సాహో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగె సినిమానే 

అయినప్పటికీ, అటువంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు అనేది ఎక్కగా కూడా రాసి లేదని, అలానే గతంలో పలు యాక్షన్ కథాంశంగా రూపొంది, రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయంటే, అందరు ప్రేక్షకుల ఆమోదం పొందే ఆ విధమైన సక్సెస్ సాధించాయి కదా. కాబట్టి సాహోలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా సీన్లు లేకపోవడం వలన ఆ సినిమాకు నష్టం జరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే అని, సినిమా బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మరొక రెండు రోజులు ఓపిక పట్టాల్సిందే ...!!


మరింత సమాచారం తెలుసుకోండి: