టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం డిస్కో రాజా అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్స్ నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ జతకడుతుండగా, ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత అతి త్వరలో రవితేజ మరొక సినిమాను ప్రారంభించనున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో, తమిళ హీరో విజయ్ సూపర్ హిట్ మూవీ అయిన తేరి సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు రవితేజ. నిజానికి ఈ సినిమా రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది. అయితే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలవైపు అడుగులు వేయడంతో, ఆ సినిమా రవితేజ ను వరించింది. అతి త్వరలో ప్రారంభం కానున్న ఆ సినిమాతో పాటు రవితేజ మరొక సినిమాలో కూడా నటించబోతున్నట్లు నేడు ఒక అనౌన్సుమెంట్ రావడం జరిగింది. గతంలో రవితేజతో డాన్ శ్రీను సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని, మళ్ళి ఇన్నేళ్ల తరువాత ఆయనతో కలిసి మరొక సినిమా తీయనున్నారు. 

కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రవితేజతో సినిమాపై ప్రకటన చేసిన గోపీచంద్, ప్రస్తుతం ఆ సినిమా కోసం ఫుల్ స్వింగ్ లో కథా చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలో కథ సిద్ధం చేసి, ఆయనతో సినిమాను ప్రారంభిస్తానని అన్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను ఫ్లాప్ కావడంతో, ఈసారైనా వీరి కాంబోలో రాబోతున్న సినిమా హిట్ సాధిస్తుందా అంటూ పలువురు నెటిజన్లు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: