బిగ్‌బాస్ షో రోజురోజుకు హాట్ హాట్ గా మారుతోంది. బుధవారం నాటి ఎపిసోడ్లో హౌస్‌మెట్స్‌ చేసిన రచ్చ ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. బిగ్ బాస్ ఇంటి సభ్యుల‌కు బిగ్ బాస్ ఛ‌లో ఇండియా షో టాస్క్ ఇచ్చాడు.  బిగ్ బాస్ ట్రైన్‌లో కంటెస్టెంట్లు అందరూ ఇండియాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ టాస్క్‌లో శ్రీముఖి అందమైన అమ్మాయిగా కనిపించింది. రవి - పునర్నవి జంటగా నటించారు. ఇక శ్రీముఖి టూర్ మేనేజర్ గా ఉన్న ఆలీకి సైట్ కొడుతూ ఉంటుంది. శ్రీముఖి పొట్టి నిక్క‌రు వేసుకుని పూర్తిగా ఎక్స్ పోజ్ చేస్తూ ఆలీని లైన్లో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసింది.


ఇక ట్రైన్లో పున‌ర్న‌వి - ర‌వి భార్య‌భ‌ర్త‌లుగా న‌టించడం కంటే జీవించేశారు. వీరి రొమాన్స్ మ‌రీ ఓవ‌ర్ అయిపోయిన‌ట్ల‌నిపించింది. మాటిమాటికి కౌగిలించుకోవ‌డం... ప్ల‌యింగ్ కిస్సులు.. ముద్దులు... ర‌వి ఒళ్లో పున‌ర్న‌వి వాలిపోవ‌డం ఇలా రొమాన్స్ కాస్త ఘాటుగానే అనిపించింది. పున‌ర్న‌వి - ర‌వి ఇద్ద‌రు ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక అమాయ‌కుడు అయిన భ‌ర్త‌గా మ‌హేష్‌, నోరు ప‌డేసుకుని ఊరికే ప‌డిపోయే భార్య‌గా హిమ‌జ న‌టించింది.


ఇక గ‌డుసు త‌ల్లిగా తీన్మార్ జ్యోతి న‌టిస్తే ఆమె కూతురిగా వితిక షెరూ చేసింది. ఇక ట్రైన్ న‌డిపే డ్రైవ‌ర్‌, కండెక్ట‌ర్లుగా రాహుల్‌, వ‌రుణ్‌ న‌టించారు. ఇక ట్రైన్‌లో చాయ్‌, బిస్క‌ట్లు అమ్ముకునే వాడిగా బాబా భాస్క‌ర్ న‌టించాడు. బాబా ట్రైన్లో ఉన్న వారితో త‌న‌కు మొత్తం ముగ్గురు భార్య‌లు అని తాను టీలు, బిస్క‌ట్లు అమ్ముకుంటూ వారిని పోషిస్తానని కామెడీ చేశాడు. ఇక గురువారం కూడా ఈ ట్రైన్ టాస్క్ కంటిన్యూ అవుతుంది. 


ఈ వారం ఎలిమినేష‌న్లో మొత్తం ఆరుగురు స‌భ్యులు ఉన్నారు. అయితే వీరిలో సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన రాహుల్‌, ర‌వి, వ‌రుణ్ సందేశ్ సేఫ్ అయ్యారు. ఇక ఎలిమినేష‌న్లో ముగ్గురు మిగిలారు. వీరిలో హిమ‌జ‌, పున‌ర్న‌వి, మ‌హేష్ విట్టా మాత్ర‌మే ఉన్నారు. మ‌రి ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: