రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ సాహో, రేపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తొలిసారి జోడి కట్టిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశి, ప్రమోద్ భారీ ఖర్చుతో నిర్మించగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు సాంగ్స్, సినిమాపై ఊహకందని రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. 

ఇక రిలీజ్ కు కొద్దిరోజుల ముందు నుండే సాహో సందడి షురూ చేసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే తమ హీరో సినిమా పోస్టర్లను మరింతగా షేర్స్, లైక్స్ చేస్తూ సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల, ఫ్లెక్సీల తో సందడి కూడా మొదలెట్టేసారు. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన సాహో అతి పెద్ద ఫ్లెక్స్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతూ, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచింది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి, 

బాహుబలి 2 రిలీజ్ సమయంలో కూడా ఇదే భీమవరంలో అతి పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇక మళ్ళి ఇప్పుడు సాహోకు భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి డార్లింగ్ ఫ్యాన్స్, సినిమాకు మరింతగా క్రేజ్ తీసుకువస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీని చూసిన అక్కడి స్థానికులందరూ వహ్వా అంటూ నోరెళ్లబెడుతున్నారట. మరి ఈ విధంగా అటు ప్రేక్షకులలో, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు పెంచేసిన సాహో సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుని,  కలెక్షన్స్ సంపాదిస్తుందో వేచి చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: