సాహో మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెన్సార్ టాక్ సైతం పాజిటివ్ గా ఉండటంతో కలెక్షన్లు సునామి ఏ రేంజ్ లో ఉండబోతుందనే దాని చుట్టూనే అందరి చూపులు ఉన్నాయి.  యూఎస్ లో ఇప్పటికే 4 కోట్ల రూపాయలకు పైగా టికెట్స్ ద్వారా వసూలు సాధించింది.  ప్రీమియర్ షో సమయానికి ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.  ఆంధ్రప్రదేశ్లో ఆరు షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.  
దీంతో ఈ అర్ధ రాత్రి నుంచే షోలు వేస్తున్నారు.  ఇక్కడ విషయం
ఏమిటంటే.. ప్రభాస్ తన ప్రీమియర్ షోను ఇండియాలో కాకుండా దుబాయ్ లో చూస్తున్నాడు. ప్రీమియర్ షో చూసిన తరువాత అక్కడి నుంచి హాలిడే ట్రిప్ కు వెళ్తారని తెలుస్తోంది.  దాదాపు నెల రోజులపాటు సినిమా ప్రమోషన్ కోసం ఇండియా మొత్తం తిరిగారు.  దీంతో ప్రభాస్ బాగా అలసిపోయినట్టు తెలుస్తోంది.  


ఇదిలా ఉంటె, ప్రభాస్ అతని ఫ్రెండ్స్ కలిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో వి ఎపిక్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించారు.  ఈ థియేటర్ ఈరోజు ఓపెన్ కాబోతున్నది.  మాములుగా ఈ థియేటర్లో ప్రభాస్ సినిమా చూస్తారని అనుకున్నారు.  కానీ, అయన దుబాయ్ వెళ్లిపోవడంతో ఈ థియేటర్ ను ఎవరు ఓపెన్ చేయబోతున్నారా అనే క్యూరియాసిటీ అందరిలోనూ కలిగింది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ ఈ సినిమా థియేటర్ ను ఓపెన్ చేయబోతున్నారు.  


ఆ థియేటర్లోనే అయన ప్రీమియర్ షో చూడబోతున్నారని తెలుస్తోంది.  ప్రభాస్ ప్రత్యేకంగా ఈ షో చూడటానికి ఎందుకు వస్తున్నారు అనే దానిపై అందరికి అనేక అనుమానాలు ఉన్నాయి.  ఈ అనుమానాలకు చెక్ పడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.  ప్రభాస్ సాహో సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగస్వామ్యంగా ఉన్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి.  ఇది నిజంగా షాక్ న్యూస్ అనే చెప్పాలి.  ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు అనే సంగతి ఎవరికీ తెలియదు. అందుకోసమే రామ్ చరణ్ సూళ్లూరుపేటలోని వి ఎపిక్ ముల్టీప్లెక్స్ థియేటర్స్ ఓపెనింగ్ కు హాజరవుతున్నారని వినికిడి.  


మరింత సమాచారం తెలుసుకోండి: