యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదలకు ఇంకా కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఇప్పటికే ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు టికెట్స్ బుక్ చేసుకొని షో కొరకు వేచి చూస్తున్నారు. సాహె షో టైం ఎప్పుడు అవుతుందా ? అని ప్రతి ఒక్కరు ఉత్కంఠతో వెయిటింగ్లో ఉన్నారు. సాహో సినిమా కోసం నార్త్ టు సౌత్... కశ్మీర్ టు కన్యాకుమారి బాలీవుడ్, టాలీవుడ్, మల్లూవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్ ప్రతి చోటా హంగామా మామూలుగా లేదు.
మరి ఫ్యాన్స్ అంతలాఆరాధించే ప్రభాస్ సాహో మూవీ ఎక్కడ చూడనున్నదో తెలుసా?. ప్రభాస్ సాహో స్పెషల్ షో దుబాయిలో ఓ వరల్డ్ క్లాస్ మల్టీఫ్లెక్స్లో చూస్తారట. అక్కడ ఆయన సాహో స్పెషల్ స్క్రీనింగ్ ఎంజాయ్ చేసిన తరువాత వెంటనే హాలిడే కి వెళ్ళిపోతారని తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పిండిపాలెం వద్ద చెన్నై - కలకత్తా జాతీయ రహదారిపై ప్రభాస్ భాగస్వామిగా ఉన్న మల్టీఫ్లెక్స్ను ఈ రోజు మెగాపవర్స్టార్ రామ్చరణ్ ప్రారంభించారు.
ఈ థియేటర్ రేపు సాహోతో ఓపెన్ అవుతోంది. ఇక ప్రభాస్ సాహో ప్రమోషన్స్ కొరకు నెలరోజులకు పైగా విపరీతంగా కష్టపడ్డాడు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఇండియాలోని అనేక ప్రదేశాలు తిరగడంతో పాటు, అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అందుకే ఎవ్వరికి తెలియని ప్రదేశానికి హాలిడే ట్రిప్ కొరకు ప్రభాస్ వెళ్లిపోనున్నారట. సాహోలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు.
సాహోకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించింది. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్ స్టార్డమ్ నేషనల్ వైడ్గా టాప్ లెవల్కు వెళ్లిపోతుంది. ప్రభాస్ నేషనల్ స్టార్గా వెలిగిపోతాడు. మరి సాహో ఏం చేస్తుందో ? చూడాలి.