మహేశ్ బాబు సినిమా కొత్త సినిమా వస్తుందంటే అభిమానులు, ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. మహేశ్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ విషయంలో రాయలసీమ ఏరియాలో చిన్న చిక్కొచ్చి పడిందని వార్తలొస్తున్నాయి.

 


ఈ సినిమాకు రాయలసీమ రీజియన్ లో బిజినెస్ చేయాలని భావించిన దిల్ రాజుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్ షాకిస్తున్నట్టు సమాచారం. మహేశ్ ప్రీవియస్ హిట్ మహర్షి మూవీని పంపిణీ చేసిన సదరు డిస్ట్రిబ్యూటర్ కే సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా వెళ్లిందట. అయితే మహర్షి సినిమాకు అక్కడ దాదాపు రెండు కోట్లు లాస్ వచ్చిందని సమాచారం. ఈ దెబ్బతోనే దిల్ రాజు చెప్పిన రేటుకు ఆయన అంగీకరించట్లేదని అంటున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న మహర్షి సినిమాకే ఇంత లాస్ వచ్చింది కాబట్టి సరిలేరు నీకెవ్వరు సినిమాను రేట్ తగ్గించి ఇవ్వాలని అంటున్నాడట. సమ్మర్ లో పోటీ లేకుండానే రిలీజైన మహర్షికే లాస్ వచ్చింది.. సంక్రాంతికి బన్నీ, రజినీకాంత్ సినిమాలు కూడా ఉన్నాయి అని అంటున్నాడట. దీంతో ఈ సినిమా రాయలసీమ బిజినెస్ విషయంలో ప్రస్తుతానికి బ్రేక్ పడిందంటున్నారు.

 


ఈ సినిమాకు దిల్ రాజు ఎంత చెప్పాడో, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎంతకి అడిగాడో క్లారిటీ లేకపోయినా ఈ వార్త మాత్రం ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఎంత సూపర్ హిట్ అయినా ఒక్కోసారి కొన్ని సినిమాలకు లాస్ వస్తూంటుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా టైముంది కాబట్టి రాయలసీమ బిజినెస్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: