నాలుగు ఫ్లాపులు పడ్డా ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరోయిన్ల రేట్లు ఆకాశానికి అంటుతాయి. అది ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా సహజంగా జరిగేదే. ఇప్పటిదాకా ఫ్లాపులు మూటగట్టుకున్న హీరోయిన్లు నభానటేష్, నిధి అగర్వాల్ లు కూడా తమ పారితోషికాలు అమాంతం పెంచేసినట్లు టాలీవుడ్ లో తాజాగా వినిపిస్తోంది. పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడమే అందుకు ముఖ్య కారణం. నభా, నిధి ఇద్దరు కొత్త ఆఫర్ వస్తే చాలు ఎనభై లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు స్కిన్ షోకు ఏమాత్రం వెనకాడరు కాబట్టి.

అయితే వాళ్లు డిమాండ్ చేసినంత మాత్రాన నిర్మాతలు ఇవ్వరన్న విషయం కూడా అందరికి తెలిసిందే. నిర్మాత, హీరోయిన్ల మధ్య బేరాలు, సారాలు మామూలే. నిధి లేటెస్ట్ గా ఓ సినిమాను తక్కువకే అంగీకరించినట్లు లేటెస్ట్ న్యూస్. డేట్స్ తో సంబంధం లేకుండా యాభైలక్షల లోపు పారితోషికానికి సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నభా కూడా చెప్పడం 80 వరకు చెప్పి, యాభై రేంజ్ లో ఒప్పుకుంటున్నట్లు వినిపిస్తోంది. 

అయితే హీరోలు, డైరక్టర్ల రెమ్యూనిరేషన్ తో పోల్చుకుంటే వీళ్ళ రెమ్యునిరేషన్ బాగా తక్కువేనన్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ తో పోల్చుకుంటే కూడా పాపం మన హీరోయిన్ల పారితోషికాలు బాగా తక్కువేనని చెప్పాలి. ఇక నభా డిస్కోరాజా సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన నటిస్తోంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక నిధికి బాలీవుడ్ లో ఒక సినిమా ఆఫర్ వచ్చినట్లు రీసెంట్‌గా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా హాల్‌చల్ చేస్తోంది. దీంతో పాటు తెలుగులో ఇద్దరు యంగ్ హీరోస్ సినిమాలలో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఏదేమైనా పూరి ఇస్మార్ట్ శంకర్ తో హీరోయిన్స్ జాతకమే మార్చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: