ఈరోజు ఇంకా తెల్లవారకుండానే ‘సాహో’ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఈ ప్రచారాన్ని చూసి ప్రభాస్ అభిమానులు కలవర పడిపోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ తో సమానంగా నెగిటివ్ టాక్ హడావిడి కొనసాగుతోంది. 

దీనితో ఎలర్ట్ అయిన ‘సాహో’ నిర్మాతలు పదేపదే కొందరు తమ ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి అదేవిధంగా వారు ఈ సినిమాకు  సంబంధించి లీక్ చేస్తున్న వీడియోలు స్పాయిలర్స్ గురించి వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వీటిని ట్విటర్ అకౌంట్ నుండి తొలగించడమే కాకుండా ఇదే పనిని వరసగా చేస్తున్న వారి ఎకౌంట్ ను గుర్తించి వారిని ట్విటర్ నుండి సస్పెండ్ అయ్యే విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు టాక్. 

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి లీక్ అవుతున్న కొన్ని వీడియోల క్లిపింగ్స్ పై ఈ మూవీ నిర్మాతలు స్పందించారు. ఈ సినిమాను పైరసీలో చూస్తే ఏమి మజా ఉండదనీ ఈ సినిమాను ధియేటర్లలో కుటుంబ సభ్యులు సన్నిహితులతో చూసినప్పుడు మాత్రమే ఈ మూవీలోని అద్భుతమైన గ్రాఫిక్స్ క్వాలిటీ తెలుస్తుంది అంటూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 

జరుగుతున్న ఈ ‘సాహో’ నెగిటివ్ ప్రచారం పై ‘కొబ్బరిమట్ట’ నిర్మాత సాయి రాజేష్  ఒక వీడియోను విడుదల చేసాడు. ఈ మూవీ పై నెగిటివ్ వార్తలను ప్రచారంలోకి తీసుకువస్తున్న వారందర్నీ ‘ఏం చిల్లరగాళ్ళురా మీరు’ అంటూ ఈ మూవీ పై విష ప్రచారం చేస్తున్న వారి పై విరుచుకు పడుతున్నారు. దీనితో ప్రస్తుతం ‘సాహో’ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య సోషల్ మీడియాలో భీకర పోరు జరుగుతోంది. ఈ విషయంలో ఎవరి ఎవరి పై పైచేయి సాధిస్తారు అన్నది ఈ సాయంత్రానికి కానీ క్లారిటీ వచ్చే ఆస్కారం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: