నేడు దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వినపడుతున్నా, మరికొంత నెగటివ్ గా కూడా టాక్ వినపడుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ సహా, సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోల నుండి చాలావరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, అక్కడక్కడా కొందరు మాత్రం, సినిమా ఊహించిన రేంజ్ లో లేదని పెదవి విరుస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమాపై ఇండియా వైడ్ ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ క్రిటిక్ తరన్ ఆదర్శ్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ సినిమాకు షాకింగ్ రేంజ్ లో రివ్యూ ఇవ్వడం జరిగింది. తనకు సాహో పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, అయితే నేడు ఈ సినిమా చూసిన తరువాత, అవన్నీ ఒక్కసారిగా తలక్రిందులయ్యాయని ఆదర్శ్ తన పోస్టులో తెలిపారు. ప్రభాస్ వంటి అద్భుతమైన నటుడిని సరిగ్గా వినియోగించుకోవడంలో దర్శకుడు సుజీత్ పూర్తిగా విఫలం అయ్యాడని, భారీ ఖర్చుని, అలానే ఎంతో అత్యద్భుతమైన అవకాశాన్ని సుజీత్ చేజేతులా చెడగొట్టుకున్నాడని ఆయన పోస్ట్ లో తెలిపారు. అంతేకాక ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న స్టోరీలో అసలు దమ్ము లేదని, స్క్రీన్ ప్లే ఎంతో కన్ఫ్యూజింగ్ గా ఉండడంతోపాటు, సుజీత్ దర్శకత్వంలో ఎన్నో లోపాలు సినిమాలో కనపడ్డాయని, 

అందుకే ఈ సినిమాకు తాను ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్ మాత్రమే అని ఆదర్శ్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. ఇప్పటికే సినిమాపై కొంత మిక్స్డ్ టాక్ వస్తుండడంతో, తరన్ ఆదర్శ్ ఎటువంటి రివ్యూ ఇస్తారా అని ఎదురుచూసిన డార్లింగ్ ఫ్యాన్స్ పై ఆయన ఇచ్చిన ఈ షాకింగ్ రివ్యూ, ఒక్కసారిగా వారి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి. అయితే ఆయన రివ్యూ పై కొందరు సుముఖత వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన్ను తప్పుపడుతూ, సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: