ఒకప్పుడు కోలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు ఖుష్బూ. ఖుష్బూకు తమిళనాడులో దేవాలయం కూడా ఉన్నది. ఆమె అభిమానులు ప్రత్యేకంగా ఆమెకోసం గుడిని కట్టారు. ఆ గుడిలో ఇప్పటికి పూజలు నిర్వహిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీనుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తరువాత కూడా ఆమెను ఆరాధించే వ్యక్తులు కోకొల్లలు.
కుష్బూ తెలుగులో చాలా సినిమాల్లోకి చేసింది. సినిమాలు పక్కన పెట్టిన తరువాత తెలుగులో చేసిన సినిమా హిట్లర్. ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చాలా కాలానికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేసింది. కాంగ్రెస్ పార్టీలో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ నాయకురాలు.. ఇటీవలే లండన్ వెళ్ళింది. అక్కడ ఆక్స్ ఫర్ట్ స్ట్రీట్ లోని ఓ మాల్ లోకి వెళ్ళింది.
ఆ షాపింగ్ మాల్ లో ఆమెను మొబైల్ ఫోన్ కేసు లు బాగా ఆకట్టున్నాయి. అందులోనుంచి ఓ కేసు ను తీసి ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్ స్టార్ రజినీకాంత్ అని పేర్కొన్నది. ఎక్కడిదో ఆగకుండా, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ ను కూడా ట్యాగ్ చేసింది. ఇది చూసిన సౌందర్య... అది రజినీకాంత్ కాదు.. తమీమ్ అని పేర్కొన్నది.
సౌందర్య ఒక్కతే కాదు.. నెటిజన్లు చాలామంది ఇదేవిధమైన సమాధానం ఇచ్చారు. అక్కడితో ఆగకుండా చెన్నై లో ఉంటూ సినిమాల్లో నటించిన నటికి రజినీకాంత్ ఎలా ఉంటాడో కూడా తెలియదా అని చెప్పి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాపం కుష్బూ చివరకు క్షమాపణలు చెప్పింది. తాను పోల్చుకోలేకపోయానని చెప్పింది. సెలెబ్రిటీల విషయంలో అందులోను రజినీకాంత్ విషయంలో ఒక్కసారి నోరు జారితే.. అభిమానులు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి.. కడిగిపారేయ్యరు..