ప్రభాస్ సాహో సినిమా గురించి కళ్లు కాయలు కాచే దాకా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. సుజిత్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కథలో దమ్ము లేకపోవడంతో సినిమాపై నెగటివ్ టాక్ మొదలైంది. ప్రీమియర్స్ నుండే డివైడ్ టాక్ రాగా తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి షోకి పక్కా రిజల్ట్ తెలిసింది.


రన్ రాజా రన్ అనే చిన్న సినిమా తీసిన సుజిత్ రెండో సినిమానే సాహో లాంటి పెద్ద సినిమా తీశాడు. అతను ఏం చెప్పి ప్రభాస్ ను ఒప్పించాడో కాని ప్రభాస్ సాహో నిర్ణయాన్ని తన ఫ్యాన్స్ కూడా తప్పుబట్టేలా చేసుకున్నాడు. కేవలం పెట్టిన బడ్జెట్ కు తగినట్టుగా యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో మ్యాటర్ ఏం లేదని తేల్చి చెబుతున్నారు.


బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి ఎలా ఉన్నా ఆడేస్తుందని భావించారో ఏమో కాని సాహోకి వస్తున్న నెగటివ్ టాక్ తో చిత్రయూనిట్ షాక్ అవుతున్నారు. అయినా 350 కోట్లు పెట్టినంత మాత్రాన సుజిత్ కాస్త రాజమౌళి అవగలడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కథకు అవసరమైన బడ్జెట్ కాకుండా లేని పోని హంగు ఆర్భాటాలు చేయడం కోసం పెట్టిన బడ్జెట్టే సాహో కొంపముంచింది.


రాజమౌళి బాహుబలి తీశాడు అంటే అది ఓ కళాఖండం అనిపించాడు. దర్శకుడంటే బడ్జెట్ పెట్టడం కాదు హీరో తాలూఖా అంచనాలు.. బడ్జెట్ పెట్టేంత కథ.. ప్రేక్షకులను మెప్పించే కథనం రాసుకోవాలి. ఆ విషయంలో సుజిత్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. తను రాసుకున్న కథకు భారీ బడ్జెట్ ఇచ్చారు కదా అని ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సాహో రిజల్ట్ చూసి సుజిత్ పై విమర్శలు చేస్తున్నారు. మరోసారి రాజమౌళి గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు.        
 


మరింత సమాచారం తెలుసుకోండి: