ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్ 2 తో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్  హిట్ కొట్టాడు సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్   లో మల్టీ స్టారర్గా   తెరకెక్కిన ఈ  చిత్రం ఈ ఏడాది  బిగ్గెస్ట్ హిట్లలో  ఒకటిగా  నిలిచింది.  ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం వెంకీ ,వెంకీమామ లో నటిస్తున్నాడు.  ఇది కూడా  మల్టీ స్టారర్ చిత్రమే.  బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో యువ  సామ్రాట్  నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. 




సెప్టెంబర్ రెండవ వారంలో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.  కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  వెంకీ కి జోడిగా  హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్  ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల ఫై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ చివర్లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. 




ఇక ఈ సినిమా తరువాత పెద్దగా బ్రేక్ తీసుకోకుండా వెంకటేష్ మరో సినిమా ను మొదలెట్టనున్నాడు. అందులో భాగంగా  నేను లోకల్, ఫేమ్ త్రినాథరావు నక్కిన తో సినిమా చేయనున్నాడు వెంకీ.  నవంబర్ మొదటి వారం లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.  పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రం లో వెంకీ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడట.  సురేష్ బాబు నిర్మించనున్న ఈచిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: