బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రోజుకో విధమైన టాస్క్ తో చాలా ఆసక్తిగా ముందుకుసాగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఛలో ఇండియా టాస్క్ లో బాగా ఆడిన ముగ్గురు హౌస్ మేట్స్ పేర్లు చెప్పమని బిగ్ బాస్  అడగ్గా.. రాహుల్,వరుణ్,బాబా భాస్కర్ పేర్లు చెప్పారు.నితో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం వీళ్ళ ముగ్గురు పోటీలో ఉండబోతున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మట్టిలో ఉక్కు మనిషి అనే టాస్క్ ఇవ్వటం జరిగింది. ఇందులో బురద మట్టిలో ముగ్గురికి లింక్ చేసి తాడు కట్టి  ,బురదలో కొన్ని బాల్స్ ఉంచారు వాటిని ఎవరు ఎక్కువ తీసి బయట పెడుతారో వల్లే ఈ వారం హౌస్ కెప్టెన్ అవుతారు అని చెప్పాడు.

ఇక టాస్క్ లో భాగంగా ..ముగ్గురు కూడా బెల్టులు కట్టుకొని రంగంలోకి దిగారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ టాస్క్ ని చాలా ఆసక్తిగా ముందుకు తీసుకుపోయారు. ఇక ఈ టాస్క్ లో ఎక్కువ బాల్స్ బాస్కెట్ లో వేసిన వరుణ్ ఈ వారం ఇంటి కెప్టెన్ అయ్యాడు. వరుణ్ అప్పట్లో బాస్కెట్ బాల్ ప్లేయర్ కావడంతో అది ఇప్పుడు బాగా హెల్ప్ అయ్యింది. కానీ ,ఇక్కడే బిగ్ బాస్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు.

అదేమిటంటే హౌస్ కి మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ వ్యవహరించాడు. ఆ సమయంలో హౌస్ మేట్స్ చాలా మంది బిగ్ బాస్ ఇంటి రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించారు. దీనిపై బిగ్ బాస్ చాలా సార్లు హెచ్చరించాడు. ఆ తర్వాత దీనిపై బిగ్ బాస్ సీరియస్ అయ్యి, కెప్టెన్ గా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని కారణంగా వరుణ్ సందేశ్ ని కెప్టెన్ గా తొలగించి , ఈ  సీజన్ లో మరో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు అంటూచెప్పాడు.మరి గతంలో బిగ్ బాస్ అలా చెప్పిన తర్వాత కూడా వరుణ్ ఏ విధంగా ఈ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొని మరోసారి కెప్టెన్ కూడా అయ్యాడు. అసలు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేని వరుణ్ పోటీలో ఉన్న బిగ్ బాస్ సైలెంట్  ఎందుకు ఉన్నదో ఎవరికీ అర్థంకాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: