నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘సాహో’ కు డివైడ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ పడ్డారు. ఇలాంటి పరిస్థితులలో నిన్న హైదరాబాద్ లోని ఒక మల్టీ ప్లెక్స్ ధియేటర్ లో ‘సాహో’ సినిమాను చూసి ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

‘సాహో’ మూవీ ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ బాగా నచ్చిందనీ విపరీతంగా తనకు మెసేజ్ లు వస్తున్నాయని ఇలాంటి సమయంలో ఈమూవీ పై ఎందుకు డివైడ్ టాక్ వచ్చింది అని ప్రచారం జరుగుతోందో తనకు అర్ధం కావడం లేదు అంటూ ఆమె కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రభాస్ కోరుకుంటే జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఒక దర్శకుడుతో సినిమా చేయగల స్థాయి ఉందని అయితే ప్రభాస్ ఎప్పుడు పెద్ద దర్శకులతో సినిమాలు చేయకుండా ముఖ్యంగా కొత్తవారిని ప్రోత్సహించడంలో ఆనంద పడతాడు అంటూ ఆమె కామెంట్స్ చేసింది. 

‘సాహో’ లో నటించిన ప్రభాస్ అందం చూసి తనకే షాక్ అనిపించిందని అలాంటిది అమ్మాయిలు ప్రభాస్ అందం చూసి ఏమైపోతారో తనకు అర్ధం కావడం లేదు అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మూవీతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందనీ ఆమె తన నమ్మకాన్ని తెలియచేసింది. 

ఈ సినిమాను ప్రభాస్ తన అభిమానులతో చూసే విషయమై స్పందిస్తూ ప్రభాస్ కు తన అభిమానులతో తాను నటించిన సినిమాను చూడటం అంటే చాల సిగ్గు పడుతూ ఉంటాడని అందువల్లనే ప్రభాస్ జనంతో కలిసి తన సినిమాలను చూడడు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. ‘సాహో’ టాక్ ఇప్పుడు అందరికీ తెలిసి పోవడంతో ఈ వీకెండ్ తో కలిసి వస్తున్న వినాయకచవితి వరకు ఈ మూవీ కలక్షన్స్ విషయంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా పండుగ తరువాత వచ్చే మంగళ వారం నుండి ఈ మూవీకి కలక్షన్స్ విషయంలో అసలైన పరీక్ష ఎదురు కాబోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: