టాలీవుడ్ లో ప్రస్తుతం కమెడియన్లు తగ్గిపోతున్నారు. సిట్యుయేషన్ కామెడీ తప్ప కామెడీ ట్రాక్ లు పెట్టకపోవడం వల్ల కమెడియన్లకి పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు టాలీవుడ్ లో డజనుకు పైగా కమెడియన్లు ఉండేవారు. అలాంటిది ఇప్పుడు కమెడియన్ల పేర్లు చెప్పాలంటే ఒకటి రెండు పేర్లు తప్ప వేరే పేర్లు గురుకు రావడం లేదు. అదీ కాకుండా కామెడీ సినిమాలు తీసే దర్శకులు కూడా తగ్గిపోవడంతో తెలుగు సినిమాల్లో కామెడీ తక్కువైంది.


జబర్దస్త్ లాంటి షోస్ వల్ల కామెడీ ఇంట్లోనే దొరకడంతో దర్శకులు సెపరేట్ గా కామెడీ సినిమాలు తీయడానికి ఇష్టపడట్లేదు. నిర్మాతలు కూడా ఆ విధంగా ఆలోచించట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కమెడియన్లకి పరిస్థితి ఘోరంగా తయరవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న కమెడియన్లని చూసుకుంటే వెన్నెల కిషోర్ ఒక్కడే స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్నాడు. ఏ సినిమాలో అయినా వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు.


వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిషోర్ ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. పెద్ద హీరోలందరితో నటించాడు. ఇప్పుడు వచ్చిన సినిమాలని చూసుకుంటే దాదాపు అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ ఉన్నాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ కమెడియన్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు.హ్మానందం, సునీల్, వేణు మాధవ్ వంటి స్టార్ కమెడియన్స్ వివిధ కారణాలతో ఇండస్ట్రీ లో ప్రభావం కోల్పోయారు.


అయితే వీరి తరువాత కొంచెం పేరు సంపాదించిన సప్తగిరి, షకలక శంకర్ వంటివారు హీరోలుగా మారడంతో వెన్నెల కిషోర్ కి పోటీ లేకుండా పోయింది.దానికి తోడు ఎటువంటి పాత్రకైనా నప్పే వెన్నెల కిషోర్ మేనరిజం ఆయనకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుంది.దీనితో ప్రస్తుతానికి టాలీవుడ్ నంబర్ వన్ కమెడియన్ వెన్నెల కిషోర్ అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: