‘ఇస్మార్ట్ శంకర్’ తో వచ్చిన ఆనందం కంటే ఇప్పుడు రామ్ కు టెన్షన్ పెరిగి పోతోంది అంటూ జోక్స్ పడుతున్నాయి. దీనికి కారణం రామ్ తో సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నా ఏ సినిమా ఒప్పుకోవాలో తెలియక ఈ యంగ్ హీరో పడుతున్న కన్ఫ్యూజన్ అని అంటున్నారు. 

వాస్తవానికి ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ తీస్తానని మొదట్లో పూరీ రామ్ కు సూచించినా అతడు పట్టించుకోలేదు అని అంటారు. దీనితో పూరీ విజయ్ దేవరకొండ వైపుకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం రామ్ కోరుకునే డైరెక్టర్స్  ఎవ్వరు ఖాళీగా లేరు. రామ్ గోపాల్ వర్మ రామ్ పై ఆసక్తి కనపరుస్తున్నా రామ్ ఆ ప్రయోగానికి భయపడిపోతున్నాడు. 

దీనితో ప్రస్తుతం రామ్ తనకు అందుబాటులో ఉన్న కొందరు డైరెక్టర్స్ చెపుతున్న కథలలోంచి ఒక కథను ఏమ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రామ్ తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఒక సినిమాను చేసే ఉద్దేశ్యంలో ఒక తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్నా ఆ కథ తనకు ఎంత వరకు నప్పుతుంది అన్న కన్ఫ్యూజన్ కూడ రామ్ కు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు ప్రస్తుతం రామ్ ఒక మాస్ మూవీ చేయాలా లేకుంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయాలా అన్న విషయమై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సస్ ఊపుతో రామ్ తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు 10 కోట్ల పారితోషికం చెపుతున్న నేపధ్యంలో ఆ పారితోషిక వార్తలు విని దర్శక నిర్మాతలు హడాలిపోతున్నట్లు టాక్. దీనితో సరైన హిట్ వచ్చి కూడ ఆ హిట్ ను రామ్ ఉపయోగించలేకపోతున్నాడు అన్న కామెంట్స్ రావడమే కాకుండా రం విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: