‘సాహో’ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ ను చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్య పడుతోంది. ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అని భావించబడ్డ ఈ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఎవరి ఊహలకు అందని విధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘సాహో’ మూవీ మేకర్స్ తన క్రియేటివిటీని దొంగతనం చేసారు అంటూ ఇప్పుడు ఒక వ్యక్తి మీడియాకు ఎక్కడం ఆశ్చర్యంగా మారింది.

ఈ మూవీలో ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్ గ్రౌండ్ లో ఒక డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ గ్రాఫిక్ కాదు. ఆ డిజైన్ ను తయారు చేసింది షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ ఈ డిజైన్ ను అతడు 2014 లో క్రియేట్ చేసాడట. ఇప్పుడు అతడికి చెప్పకుండా పూర్తిగా యధాతధంగా ఆ డిజైన్ ను ఈ మూవీ పాటలో ఉపయోగించారు. 

ఈ విషయాన్ని తెలుసుకుని సులేమాన్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఆ డిజైన్ ను ఇప్పుడు పోస్ట్ చేసి తన డిజైన్ ను కాపీ కొట్టినందుకు ‘సాహో’ నిర్మాతల పై మండిపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలీవుడ్ బ్యూటీ లీసారే చాల ఘాటుగా స్పందించింది. 

ఒకరి క్రియేటివిటీని మరొకరు దొంగిలించడం చాల ఘోరమని కనీసం అలా చేస్తున్నప్పుడు ఆ డిజైన్ క్రియేట్ చేసిన వ్యక్తి అనుమతి తీసుకోవాలి అన్న సంస్కారం ‘సాహో’ నిర్మాతలకు లేదా అంటూ ఆమె మండిపడుతోంది. అంతేకాదు ఎవరైనా ప్రభాస్ ఇంటిలోకి వచ్చి విలువైన వస్తువులు దొంగిలిస్తే ప్రభాస్ ఊరుకుంటాడా అంటూ ఆమె ప్రశ్నలు వేస్తోంది. ఒక్క ‘సాహో’ పరాజయం ప్రభాస్ పై ఎన్ని ప్రశ్నలు పడేలా చేస్తోందో దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా ప్రభాస్ కు ఊహించని సమస్యలు ఎదురయ్యాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: