నయనతార. అందాల తార. అభినయంలోనూ సాటి పోటీ లేని తార. పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తులను చూసిన నయనతార లేటెస్ట్ మూవీగా తెలుగులో  సైరా నరసింహారెడ్డి వస్తోంది. నయన తార వయసు ఇపుడు మూడున్నర పదులు. కానీ ఆమె యూత్ కు ఎపుడూ పదహారేళ్ళ పసిడి భామే మరి.  చంద్రముఖితో 2005న సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన మెరిసిన నయనతార మరి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పటికీ నాటౌట్ గా నిలిచింది.


ఇదిలా ఉండగా నయన్ ఇపుడు తమిళ్ లో   బిగిల్ అనే మూవీలో టాప్ స్టార్ విజయ్ పక్కన చేస్తోంది. ఈ సినిమాకు గానూ నయన్ పారితోషికం అక్షరాలా అయిదు కోట్ల రూపాయలు అంటే నమ్మాల్సిందే.  ఈ విధంగా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ గా నయన్ రికార్డ్ స్రుష్టించింది. ఇప్పటివరకూ బాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్  తీసుకున్న వారిలో దీపికా పదుకునే, ఆలియాభట్ ఉన్నారు.


వారిద్దరూ కూడా నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆలిండినా లెవెల్లో వారు నాలుగు కోట్లు తీసుకుంటే ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి నయన్ 5 కోట్లు అంటే ఆమె డిమాండ్ చెప్పనవసరం లేదు మరి. బిగిల్ మూవీని సౌత్ ఇండియా అంతటా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం 200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. మరి ఇంతటి క్రేజీ మూవీలో నయన్ నటించడం, ఆమె పారితోషికం ఒక్కసారిగా పెంచడంతో నయన్ ఎక్కడా తగ్గడంలేదుగా అంటున్నారు. 


ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న నయన్ మరిన్ని సినిమాలు చేసినా 5 కోట్ల పారితోషికం మాత్రం తగ్గదని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే తెలుగులో ఆమె నటించడానికి కూడా ఇకపై ఈ హయ్యెస్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: