తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 షో ఇప్పటికీ ఆరోవారం రన్ అవుతుంది.  మొదటి బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 2 కి ఆ ప్లేస్ లో నాని ఎంట్రీ ఇచ్చారు.  ఇక బిగ్ బాస్ 3 కి అక్కినేని నాగార్జున్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ 3 లో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కూల్ గా సాగిపోతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్, కెప్టెన్ టాస్క్ మద్య మద్యలో ఇంటి సభ్యుల మద్య గిల్లి కజ్జాలు..తిట్టుకోవడాలు లాంటివి జరుగుతున్నాయి.  ఈ వారం ఎపిసోడ్ లో అలీ రజా, రాహూల్ మద్య మాటల యుద్దం తర్వాత ఏకంగా కొట్టుకునే పరిస్థితికే వచ్చింది.

అయితే అదంతా టాస్క్ లో భాగం అని తెలిసిన తర్వాత ఇద్దరి మద్య స్నేహం కుదిరింది. ఇలా ఎన్నో ట్విస్టుల మద్య వారాంతం రానే వచ్చింది.  అయితే ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున రావడం..ఇంటి సభ్యులకు కొన్ని గెమ్స్, టాస్క్ లు ఇవ్వడం చివరిగా ఎలిమినేషన్ ఎవరు అన్న విషయం చెప్పడంతో సాగుతుంది. ఆదివారం ఎలిమినేషన్ అయిన వారిని ఇంటి నుంచి పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అష్షు రెడ్డి వెళ్లిపోయారు. 

మరి ఈవారం ఎవరు వెళ్తారు అన్నది సస్పెన్స్..అయితే ఈ విషయాన్ని చెప్పడానికి ఈ వారం బిగ్ బాస్ లో నాగార్జున రావడం లేదని వార్తలు వస్తున్నాయి.   తన 60వ పుట్టినరోజు వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షోపై పలు సందేహాలు నెలకొన్నాయి.  దాంతో అసలు ఈ వీకెండ్ ఏం జరగబోతుందని ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదరు చూస్తున్న సమయలో ఓ ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. 

ఈ క్రమంలో మొదట నానితో హోస్ట్ చేయించాలని అనుకున్నా.. ఆయన ఇండియాలో లేకపోవడంతో ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు. మొత్తానికి సీనియర్ నటి రమ్యకృష్ణను రంగంలోకి దింపారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. 'ఇదే నా మాట.. నా మాటే శాశనం' అంటూ బిగ్ బాస్ షో స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చేసింది రమ్య కృష్ణ. మరి ఈ వారం ఎలాంటి ఎంట్రటైన్ మెంట్ ఉండబోతుంది..శివగామి ఎలా తన పవర్ చూపించబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: