క్షణం,గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.క్రియేటివ్ పార్ట్‌ను లీడ్ చేస్తూ పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమా "ఎవరు".రెజీనా,నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతూ ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్‌కి అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభించింది.యూనానిమస్ హిట్ టాక్ రావడంతో ‘ఎవరు’బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.ఆ సినిమాతో పాటు విడుదలైన శర్వానంద్‘రణరంగం’కి ప్లాప్ టాక్ రావడం,థియేటర్స్‌లో వేరే ఏ సినిమా పోటీగా లేకపోవడంతో ‘ఎవరు’కలెక్షన్స్ పరంగా సత్తా చాటిందని చెప్పవచ్చూ..



అయితే, రెండు వారాల గ్యాప్‌లో బరిలోకి దిగిన ‘సాహో’అంచనాలు అందుకోకపోవడంతో అడివి శేష్ సోషల్ మీడియాలో మళ్ళీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు.దానిలో భాగంగా ‘ఎవరు’తన గత సినిమా ‘గూఢచారి’కంటే తన కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది అని ట్వీట్ చేసాడు. అయితే అడివి శేష్ పెట్టిన ఈ ట్వీట్‌కి ఊహించని రిప్లై ఇచ్చాడు.‘ఎవరు’నిర్మాత అభిషేక్ నామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడివి శేష్‌కి బిగ్గెస్ట్ హిట్ ‘ఎవరు’అని కన్‌ఫం చేసావు.ఇది అంత పెద్ద హిట్ అయితే ఆ సినిమా బాక్సాఫీసు కలెక్షన్స్ షేర్ చెయ్యగలవా అంటూ ప్రశించాడు.ఈ ప్రశ్న వెనక‘గూఢచారి’సీక్వెల్ విషయంలో వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందా అనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.ఇకపోతే‘గూఢచారి’సినిమాకు నిర్మాత అభిషేక్ నామానే అయినా..ఆ చిత్రాన్ని కొనుక్కుని డిస్ట్రిబ్యూట్ చేసింది మాత్రం అనీల్ సుంకర.అలాంటప్పుడు ‘ఎవరు’ సినిమా ప్రొమోషన్ కోసం ట్వీట్ చేసిన అడివి శేష్‌ని అంత బాహాటంగా కార్నర్ చేయాల్సిన అవసరం ఏమిటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: