శివగామి కొత్త అవతారం ఎత్తింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ త్రీ లోకి అడుగుపెట్టింది. కానీ రమ్యకృష్ణ బిగ్ బాస్ త్రీ ఎంట్రీ కంటెస్టెంట్ గా కాదండోయ్, వ్యాఖ్యాతగా అదేంటి ఆల్రెడీ నాగార్జున ఉన్నారు కదా అనుకుంటున్నారా, నాగ్ విదేశాలకు వెళ్ళిన కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు రమ్యకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకొచ్చారు. శనివారం, ఆదివారం ఎపిసోడ్ లో ఇపుడు శివగామి ఏ నాగ్ ప్లేస్ లో దుమ్ము రేపేందుకు సిద్ధమయ్యారు. బిగ్ బాస్ త్రీ ఇప్పటికే నలభై రోజులు పూర్తి చేసుకుంది. అయితే ప్రతి వారాంతం వ్యాఖ్యాతగా నాగార్జున వచ్చి ఫన్నీ టాస్కులతో ఎంటర్ టైన్ చేస్తారు.అంతేకాదు ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా కింగ్ నాగ్ రివీల్ చేస్తారు.


అయితే ఇప్పుడు రమ్య కృష్ణ బిగ్ బాస్ త్రీ లో అడుగుపెడుతున్నారు. ప్రతి వీకెండ్ సభ్యులను చక్కదిద్దడమే కాదు టాస్క్ లతో అలరించి ఆఖరికి ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేస్తారు. నాగార్జున తన బర్త్ డే వేడుకల కోసం విదేశాలకు వెళ్లారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయాలని ఆలోచించిన బిగ్ బాస్ నిర్వాహకులు శివగామిని రంగం లోకి దించారు. ఇప్పటికే రమ్య కృష్ణ ఎంట్రీ ప్రోమో అదరగొడుతోంది.


అయితే నాగ్ రేంజ్ లో రమ్య కృష్ణ ఆకట్టుకుంటారా నవ్వులతో ఎంటర్ టైన్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్ల ను ఎలా దారి లోకి తీసుకొస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి బాహుబలి తర్వాత రమ్య కృష్ణ రేంజ్ పెరిగింది. ముఖ్యంగా అన్ని వర్గాల్లో ఆమె మునుపటి క్రేజ్ ను సంపాదించుకుంది. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రమ్యకృష్ణనే బెటర్ అని భావించారు బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు. అందుకే వీకెండ్ ప్రోగ్రామ్ ని శివగామితో ప్లాన్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: