మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో "మిస్టర్ రావణ" అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ తీసె ఈ సినిమా ఇటీవలె ముంబై లొని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ లొ ప్రారంభమైంది. కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సలోని గతంలో సునీల్ సరసన మర్యాదరామన్న చిత్రంలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో చేసింది కాని ఆశించినంత ఫలితం రాలేదు. ఇకమరి ఈ భామకు ఈ చిత్రం ఎలాంటి హిట్ని ఇస్తుందో చూడాలి. అనూప్ సింగ్ ఠాగూర్ తెలుగులో చాలా చిత్రాలకు ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. అయితే ఆయన హీరోగా నటించే మొదటి చిత్రమిది. కథ బావుంటే మన తెలుగు వాళ్లు ఎప్పుడూ ఎలాంటివారినైనా అందర్నీ ఆదరింస్తుంది. ఇక వీరిద్దరి ఈ చిత్రం ఎలాంటి మేలు చేస్తుందో వేచి చూడాలి.
అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ , నా క్యారక్టరైజెషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. నటిడుగా నా కెరీర్ లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.
దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడె. ఈ సినిమాలొ కూడా ఆయన టైటిల్ పాత్రలొ నట విశ్వరూపాన్ని చూపిస్తారు.సలోని హీరొయిన్ గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు.
నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రం లో ఉంటారన్నారు.
ఈ చిత్రానికి ,కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం : కుందన్ ఆర్ట్స్, కథ-కథనం-దర్శకత్వం : కుందన్ రాజ్.