బిగ్ బాస్ సీజన్ 3 లో మరో కలర్ ఫుల్ వీకెండ్ వచ్చేసింది. నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉండటం తో ఈ వీకెండ్ శివగామి బిగ్ బాస్ హోస్ట్ గా రంగంలోకి దిగింది. ఏదైనా నేను దిగనంత వరకే...ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్..అంటూ రమ్యకృష్ణ హోస్ట్ గా దుమ్మురేపుతోంది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి చూస్తే.. హోస్ట్ రమ్యకృష్ణ ని బాహుబలి లో హీరోయిన్ అనుష్కని చూపించినట్టుగా తెరతో కప్పి ఉంచి ఒక్కసారిగా ఓపెన్ చేసారు.

దీనితో నాగ్ ప్లేస్ లో శివగామి రమ్యకృష్ణ ఉండటం చూసి హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఆ తరువాత నాగార్జున వీడియో కాల్ ద్వారా రమ్యకృష్ణ తో మాట్లాడాడు...నిన్ను చూస్తుంటే గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నాయి అంటూ నాగ్ చెప్పగానే రమ్యకృష్ణ సిగ్గుతో స్టేజ్ పైనే మెలికలు తిరిగిపోయింది.
వచ్చి రాగానే ఒక చిన్న గేమ్ అంటూ రమ్యకృష్ణ హౌస్ మేట్స్ కి మనిషి గురించి చెప్పండి అంటూ ఒక టాస్క్ ఇచ్చింది.

ఈ టాస్క్ లో శివజ్యోతి..రాహుల్ పై రెచ్చిపోతోంది.. అసలు మనిషే కాదు... ప్రతి దానికీ భయపడతాడు అంటూ చెప్తుంది. ఇక అలీ శ్రీముఖి గురించి మాట్లాడుతూ..ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అనగానే ఎలా అంటే.. హౌస్ మొత్తం తిరుగుతూ అలీ శ్రీముఖి లా రచ్చ రచ్చ చేసాడు. అలాగే పునర్నవి ని బాగా పొగుడుతుంది.ఈ సమయంలో నేను అని బాబా భాస్కర్ అడగ్గా ..అసలు ని ఔట్ ఫుట్ లో ఫిట్టే లేదు అంటూ బాబా కి గాలి తీసేసింది. ఆ తరువాత రాహుల్ తో ఈ ఇంట్లో నీకు జరిగిన అన్యాయం ఏంటి అంటే ఏమీలేదు అని చెప్పాడు..

దీనితో రవి రాహుల్ కి ఏం అన్యాయం జరగలేదా అని మాట్లాడుతుంటే.. పునర్నవి అది జస్ట్ టాస్క్ అంటూ మా మధ్యలో ఎదో ఉంది అని హింట్ ఇచ్చేసింది. అలాగే మహేష్ ఓపెన్ అవ్వు..ఓపెన్ అవ్వడానికే కదా ఈ గేమ్ అంటూ ఫైర్ అయ్యింది.ఇక బాబా నామినేషన్ గురించి ఆర్గ్యు చేస్తుంటే నామినేషన్ గురించి ఎందుకు నువ్వు చేశావ్ కదా.... నీకు ఒక రూల్ వాళ్ళకి ఒక రూల్ ఉంటుందా అంటూ బాబా పై రెచ్చిపోయింది.ఇక క్లాప్స్ అయినా  కొట్టండి మేడం అనగా..నా ఇష్టం .మీరు చెప్పొద్దూ మాస్టర్ నీకు పనిష్మెంట్ ఇస్తాను..నేను నాగార్జున లా కాదు...ఇక్కడ నా మాటే శాసనం అంటూ ఫుల్ ఫైర్ లో ఉంది. మొత్తంగా ప్రోమో చూస్తే... తోలి బిగ్ బాస్ హోస్ట్ గా తొలి ఎపిసోడ్ అయినప్పటికీ రమ్యకృష్ణ ఏక్కడా తడపడకుండా చాలా చక్కగా షో ని హ్యాండిల్ చేసినట్టు కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: