ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ తో దూసుకుపోతున్న షోల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ఈ షో ప్రారంభ సమయంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ, వాటన్నిటినీ ఎదుర్కొని, షోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన, ఆపై పాపులారిటీ రావడం జరిగింది. ఇక ఈ షో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఎంతో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి  చేసుకున్న బిగ్ బాస్ షో, ప్రస్తుతం కింగ్ నాగార్జున సారథ్యంలో సీజన్ 3 మరింత జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే నాగ్, తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో, షో పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారనే చెప్పాలి. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో, నేడు ఈ షోకు హోస్ట్ గా నాగార్జున కాకుండా, ఆయన స్థానంలో రమ్యకృష్ణ సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో, ప్రేక్షకులు ఒకింత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారనే చెప్పాలి. 

అయితే నేటి షో ప్రారంభమైన తరువాత, నాగ్ ఈ వారం హోస్ట్ గా రాకపోవడానికి గల కారణాన్ని, ఆయన వీడియో బైట్ ద్వారా వివరించడం జరిగింది. అనుకోకుండా ఈ పుట్టిన రోజు వేడుకకు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం వల్లనే, తన స్థానంలో రమ్యకృష్ణ గారు ఈ వారం హోస్ట్ గా వ్యహరిస్తారని, అనంతరం రాబోయే వారం నుండి తానె మళ్ళీ షో కు హోస్ట్ గా వ్యవహరించడం జరుగుతుందని నాగ్, ఆ వీడియో బైట్ లో తెల్పడం జరిగింది. అయితే ఈ విషయమై నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. నిజానికి ఈ సీజన్ 3 కు హోస్ట్ గా నాగ్ కంటే ముందు వేరొక నటుడిని తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం  ప్రయత్నించగా, సదరు హీరోగారు అటువంటి ప్రోగ్రామ్స్ తాను చేయలేనని తేల్చి చెప్పడంతో చివరకు నాగ్ ను కలిసి, మెల్లగా ఆయనను ఒప్పించడం జరిగిందని అంటున్నారు. అయితే ఆయన షోలోకి ఎంటర్ అయిన సమయంలో షోపై శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తాలు షోపై కేసు వేసి, దానిని ఢిల్లీ లెవెల్ వరకు తీసుకెళ్లడంతో నాగ్ కొంత సందిగ్ధానికి లోనయ్యారట. అదీకాక గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ మొదట్లో బాగా సాగినప్పటికీ, 

ఇటీవల రెండు వారాలుగా షోకు రేటింగ్స్ తగ్గుముఖం పట్టాయని, అది మాత్రమే కాక, అన్నిటికంటే ముఖ్యంగా, నాగ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి, నిర్మించిన మన్మధుడు 2 మూవీ కూడా ఘోర పరాజయం పాలవడంతో ఆయన ఇకపై బిగ్ బాస్ షో లో కొనసాగే ఆలోచనను విరమించుకుని, ఇటీవల షో నిర్వాహకులతో మాట్లాడారని అంటున్నారు. అయితే వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాతనే రమ్యకృష్ణ ను షో యాజమాన్యం రంగంలోకి దించిందని, అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో రమ్యకృష్ణ నే బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా కొనసాగుతారని అంటున్నారు. కాగా నేడు విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై బిగ్ బాస్ టీమ్ నుండి అధికారిక సమాచారం వెలువడితేనే కానీ ఇందులో నిజానిజాలు ఏంటనేది చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: