నటుడు మరియు రచయిత అయిన అడివి శేష్ హీరోగా నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శాత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఎవరు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమా, ఇటీవల మంచి అంచనాల మధ్య  రిలీజ్ అయి, తొలిరోజు తోలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథ, కథనాలు, అద్భుతమైన థ్రిల్ ని కలిగించే సస్పెన్స్ సీన్లు, ఇక మధ్యలో వచ్చే ట్విస్టులతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంతో అలచిందనే చెప్పాలి. ఇక రెండు వారాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఈ సినిమా, నేడు మూడవ వారంలోకి అడుగుపెట్టింది. 

అయితే ఈ సినిమాతోపాటు రిలీజ్ అయిన శర్వానంద్ రణరంగం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఎవరు, మరింతగా దూసుకుపోయింది. ఇకపోతే నిన్న విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీ కూడా నెగటివ్ టాక్ ని సంపాదించడంతో, ఎక్కువగా ప్రేక్షకులు ఎవరు మూవీ చూసేందుకే ఎగబడుతున్నట్లు సమాచారం. ఎవరు సినిమా సక్సెస్ టూర్ ని నేడు నిర్వహించిన యూనిట్ సభ్యులు, ఇప్పటికీ తమ సినిమాకు చాలా చోట్ల మంచి కలెక్షన్స్ వస్తుండడం ఆనందదాయకని అన్నారు. ఇప్పటికే అడివి శేష్ గత చిత్రం గూఢచారి దక్కించుకున్న ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేసిన ఎవరు మూవీ, ప్రస్తుతం నిర్మాతలను అద్బుతమైన లాభాల బాటలో నడిపిస్తోంది. 

ఈ సినిమా పూర్తిగా క్లోజింగ్ సమయానికి నిర్మాతలకు, మరియు బయ్యర్లకు, పెట్టిన పెట్టుబడికి రెండింతలకు పైగా తెచ్చిపెట్టే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే మొన్న సాహో రిలీజ్ రోజున మాత్రం ఈ సినిమాకు ఒకింత కాస్త తక్కువ కలెక్షన్ రావడం జరిగిందని, ఇక సాహోకు నెగటివ్ టాక్ రావాడంతో నిన్నటి నుండి ఎవరు మూవీకి కలెక్షన్స్ మళ్ళి బాగా పుంజుకోవడం జరిగిందని వారు అంటున్నారు. మొత్తంగా దీన్నిబట్టి చూస్తే, సాహో దెబ్బ ఎవరు సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: