మీడియాలో వచ్చిన ఊహాగానాలకు అనుగుణంగా నిన్నటి ‘బిగ్ బాస్ 3’ షో వీకెండ్ కార్యక్రమంలో హోస్ట్ గా నాగార్జున బదులు రమ్యకృష్ణ కనిపించింది. నాగార్జున తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తాను ఈవారం ‘బిగ్ బాస్’ హోస్ లోకి రాలేకపోతున్నాను అని చెప్పిన చిన్న వీడియో సందేశం తరువాత గ్రాండ్ గా రమ్యకృష్ణ ఎంట్రీ జరిగింది. 

ఈ షోను హోస్ట్ చేయబోతున్న రమ్యకృష్ణ గురించి నాగ్ మాట్లాడుతూ తనతో సమానంగా హోస్ట్ చేయగల వ్యక్తి ఒక్క రమ్యకృష్ణ మాత్రమే అంటూ ఆమె ఎంట్రీకి లైన్ క్లియర్ చేసాడు. దీనితో ‘బిగ్ బాస్’ కార్యక్రమంలోకి వచ్చిన రమ్యకృష్ణ నాగార్జున తన ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అంటూ ఆమె నాగ్ ను ఆకాశంలోకి ఎత్తేసింది.

రమ్యకృష్ణ ఈ షోలోకి ఎంటర్ అవుతూనే హోస్ మేట్స్ అందర్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుని ‘నామాటే శాసనం’ అంటూ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తాను నాగార్జునలా మేతక మనిషిని కానని తన రూట్ వేరు అంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా మొత్తం షోను తన ఆధీనంలోకి తీసుకుంది. హోస్ మేట్స్ కు వారు చేసిన తప్పులకు సంబంధించి రకరకాల శిక్షలు వేస్తూ తన ఆదిపత్యాన్ని కొనసాగించింది.

ఈ కార్యక్రమాన్ని చాల తెలివిగా అందర్నీ తన కంట్రోలోకి తీసుకుంటూ ఒక దర్పంతో రమ్యకృష్ణ ఈ షోను నిర్వహించిన తీరు బుల్లితెర ప్రేక్షకులకు బాగా నచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈరోజు ‘బిగ్ బాస్’ షోను కూడ రమ్యకృష్ణ హోస్ట్ చేయబోతోంది. దీనితో ఈ వారం ఈ షోకు గత వారంతో పోలిస్తే చాల ఎక్కువగా రేటింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. అదే జరిగితే ‘బిగ్ బాస్’ హోస్ట్ గా నాగార్జునను రమ్యకృష్ణ డామినేట్ చేయగలిగింది అన్న రికార్డ్ బిగ్ బాస్ షోలో నిలిచి పోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: