సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్నాడు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే ఇటీవల మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్లో మహేష్ బాబు తన కొడుకు గురించి చేసిన ట్వీట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఎమోషనల్ ఫీల్ కి గురి చేసింది.


ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ ఇప్పటివరకు తీసిన వాటిలో ఇది బెస్ట్ ఫోటో. నువ్వు టీనేజ్ లోకి అడుగుపెట్టావు. తెలియకుండా గడచిపోతున్న కాలంలో ఎదుగుతున్నావు. మా జీవితానికి నువ్వొక వెలుగు. లవ్యూ మై బాయ్ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. నమ్రత కూడా ఇంస్టాగ్రామ్లో గౌతమ్ ని విష్ చేసింది. నువ్వు ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చావు.. మిస్టర్ గౌతమ్ ఘట్టమనేని అని నమ్రత ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.


ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మహేష్ బాబు- సుకుమార్ దర్శకత్వంలో ‘1 నేనొక్కడినే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి 13 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: