‘సాహో’ ప్రమోషన్ ను ప్రభాస్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఈ మూవీ కలక్షన్స్ పడిపోకుండా అనేక పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభాస్ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నాడు. తనకు వినోదాత్మక సినిమాలు అంటే బాగా ఇష్టమని అందుకే రాజేంద్రప్రసాద్ సినిమాలను మళ్ళీమళ్ళీ చూస్తాను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ఇదే సందర్భంలో టాప్ హీరో మహేష్ గురించి మాట్లాడుతూ అతడు నటించిన సినిమాలలో ‘పోకిరి’ మూవీ తనకు బాగా ఇష్టమని ఆ సినిమాను తాను ఎన్నిసార్లు తన ఇంటిలో చూసానో లెక్కలేదు అంటూ మహేష్ పై తన అభిమానాన్ని బయటపెట్టాడు. అదేవిధంగా రవితేజా ‘ఇడియట్’ మూవీ కూడ తనకు చాల ఇష్టం అని చెపుతూ తాను అందరి హీరోల అభిమానిని అని చెప్పే ప్రయత్నాలు చేసాడు. 

ఇక ఎవరికీ తెలియని ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టాడు ప్రభాస్. తనకు చిన్నతనంలో విపరీతమైన మతిమరుపు ఉండేదని ఆ మతిమరుపు వల్ల తాను పెన్ను కూడ తీసుకువెళ్ళకుండా పరీక్షలు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని ఇప్పటికి తాను టాప్ హీరోని అయినా తాను హైదరాబాద్ లో తన కారు డ్రైవ్ చేయడానికి కన్ఫ్యూజ్ అయిపోతు ఉంటానని అందువల్లనే తన చిన్నప్పటి స్నేహితులు తనను ‘గజినీ’ లా చూసేవారు అంటూ జోక్ చేసాడు. 

ఇక అందరూ తరుచూ మాట్లాడుకునే తన సిగ్గు గురించి మాట్లాడుతూ తన కుటుంబంలో కజిన్స్ అత్తలు మావయ్యలు వారి పిల్లలు అంతా కలిపి 200 మంది ఉంటామని వారంతా కలిసి తన పెదనాన్న ఇంట్లో తరుచు కలుసుకునే పరిస్థుతులలో వారందరితో తాను ఎక్కువగా కనెక్ట్ అయిపోతు బయటవారిని పట్టించుకోకపోవడం వల్ల తాను బయట వ్యక్తులతో ఎక్కువగా కలవలేకపోయిన విషయాలను అనేకం వివరించాడు. ఈ మధ్య రాజమౌళి తనకు వ్యక్తిత్వ వికాశానికి సంబంధించి ఒక పుస్తకం ఇచ్చిన విషయాన్ని బయటపెడుతూ ఆ పుస్తకం చదివిన తరువాత తాను చాల మారాను అని అంటున్నాడు ప్రభాస్..



మరింత సమాచారం తెలుసుకోండి: