ఫగ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ..తన సెకండ్ సినిమా ఎంఎస్ ధోనితో ఫేమస్ అయ్యింది.ఆ తరువాత తెలుగులో భరత్ అనే నేను,వినయ విధేయ రామ సినిమా చేసింది.హిందీలో కబీర్ సింగ్ సినిమాతో మరో స్థాయికి వెళ్ళి,ఈ సినిమాలో అవసరానికి మించి ముద్దుల వర్షం కురిపించడంతో భారీ హిట్ అయ్యింది.పైగా కథ కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంది.మరో విషయమేంటంటే కియారా అసలు పేరు అలియా అద్వాని.ఆల్రెడీ ఇండస్ట్రీలో అలియా భట్ ఉండటంతో తన పేరు ముందు కియారా చేర్చుకుంది.అదే పేరుతో ఫేమస్ అయ్యింది.ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు.అందం,అభినయం మాత్రమే కాదు తన స్టైల్,బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ..



స్టార్‌ హీరోయిన్లుగా పేరు పడిన దీపికా,అనుష్క,ప్రియాంక వంటి వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిర పడడంతో కియారాకు మంచి డిమాండ్‌ వచ్చిందట.పనిలో పనిగా కియారా తన పారితోషికాన్ని డబుల్‌ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి రెడీ అయి పోతున్నారట బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు.మరి ఇంత డిమాండ్‌ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే చాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ జనాలు అనుకుంటున్నారు.ఇక కబీర్ సింగ్ సినిమా విడుదలైన తర్వాత..ఆ సినిమాలో వున్న కంటెంట్ ఎన్నో వివాదాలకు తావిచ్చింది.అయితే అన్ని వివాదాలమధ్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది కబీర్ సింగ్ ఈ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా..కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది..



నేను సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి.అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని పేర్కోంది.అంతేకాదు తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది.అయితే పెళ్లి మాత్రం పెద్దలు కుదిర్చినది కాకుండా..కచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ తేల్చేసింది.కియారా ప్రస్తుతం 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కూమార్ తో జంటగా నటిస్తోంది.ఈ సినిమా తెలుగులో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచనకు రీమేక్‌గా వస్తోంది.ఇక 'లక్ష్మీబాంబ్‌' చిత్రం 2020  జూన్ 5న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలిపింది క్రేజీ యంగ్ హీరోయిన్..

మరింత సమాచారం తెలుసుకోండి: