బిగ్ బాస్ 3 ఆరోవారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.  ప్రతిరోజూ ఏదో ఒక టాస్క్, కాంపిటీషన్ తో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఐదో వారం బిగ్ బాస్ ఇంట్లో చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇచ్చారు.  అంతే కాకుండా ట్రైన్ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు ఇరగదీశారు.  ఇక బాబా భాస్కర్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇలా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో శనివారం రానే వచ్చింది..అందరూ నాగార్జున కోసం ఎదరు చూస్తున్న సమయంలో మరో ట్విస్ట్.. ఆయన ప్లేస్ లో శివగామిన రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది.

అంతే ఇంటి సభ్యులు అంతా షాక్..అయితే రమ్యకృష్ణ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ తో అటు ఇంటి సభ్యులు ఇటు ఆడియన్స్ మనసు దోచింది.  రమ్యకృష్ణ హౌస్ మేట్స్ కి ఇచ్చిన 'సీన్ చేయండి' టాస్క్ ఈ ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.  ఇది సభ్యులలో ఒక్కో జంటని పిలిచి ఫేమస్ చిత్రాలలోని సన్నివేశాలని చెప్పి అలా నటించాలని చెప్పారు. నిన్నటి ఎపిసోడ్  భలే రంజుగా సాగింది.  ముందుగా అలీ, రవికృష్ణ సీతమ్మవాకిట్లో సిరిలమల్లే చెట్టు చిత్రంలో మహేష్ బాబు పూలకుండీని తన్నే సన్నివేశంలో నటించారు.

ఈ సీన్లో అలీ మహేష్ బాబుగా, రవి వెంకీగా నటించారు.  తర్వాత ఇక హిమజ, మహేష్ , శివజ్యోతి కలసి రంగస్థలం చిత్రంలో ఓ సన్నివేశంలో నటించారు. రంగస్థలం చిత్రంలో సమంత తన పొలానికి నీళ్ళేయాలని రాంచరణ్, అనసూయని అడిగే సీన్ అది. పునర్నవి, రాహుల్ జోడి ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య సాగే నడుము సీన్ లో నటించారు. ఇక వరుణ్, వితిక దంపతులు ఎఫ్ 2 చిత్రంలో వెంకీ, తమన్నాగా నటించారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో హైలెట్ ‘చంద్రముఖి’సీన్.  బాబా భాస్కర్, శ్రీముఖి చంద్రముఖి చిత్రంలో రజినీకాంత్, జ్యోతిక పాత్రల్లో నటించారు.

శ్రీముఖి చంద్రముఖిలా నటిస్తుంటే ఓవరాక్షన్ చేయకు  అంటూ బాబా చెప్పడం నవ్వులు పూయించింది.  మొత్తానికి వీరిద్దరి పర్మామెన్స్ తో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు.  ఆ తర్వాత రమ్య ఇంట్లోకి ప్రవేశించి హోస్ మేట్స్ ని ఆశ్చర్యపరిచారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. సోమవారం రోజు వినాయక చవితి కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ స్వీట్ షాక్ ఇచ్చారు. దీనితో హిమజ, పునర్నవి కూడా సేవ్ అయినట్లు అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: