సన్ డే అంటే ఫన్ డే అని మరోసారి రుజువైంది. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్  ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అసలు హోస్ట్ నాగార్జున పుట్టినరోజు వేడుకల కోసం స్పెయిన్  వెళ్ళిన అతిథి పాత్రలో వచ్చిన రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో సరదా సరదా సీన్లు చేయించారు. అయితే శనివారం ఎపిసోడ్ లో కొంచెం తడబడిన రమ్యకృష్ణ ఆదివారం ఎపిసోడ్ లో ఫుల్ స్వింగ్ లోకి వచ్చారు. ఏజ్ పెరిగిన తనలో అందం తగ్గలేదు అనే  విధంగా ముస్తాబు అయి వచ్చి సోగ్గాడే చిన్ని నాయనా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు.


ఇక రావడం రావడమే సన్ డే ఫన్ డే అని చెప్పిన రమ్య...ఇంటి సభ్యులకు సీన్ చేయండి టాస్క్ ఇచ్చారు. దాని ప్రకారం సినిమాల్లోన్ని ఒక సీను ఇచ్చి దాన్ని చేయమని చెప్పారు. అలాగే చేసిన యాక్టింగుకి మార్కులు వేయాలని మిగతా ఇంటి సభ్యులకు చెప్పారు. అలాగే తాను కూడా మార్కులు వేస్తానని చెప్పారు. దీంతో మొదట రవి-అలీ రెజాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పూల కుండీ తన్నే సీను చేయగా - మహేశ్ - శివజ్యోతి - హిమజలు రంగస్థలంలో సీన్ చేశారు.


వీరి తర్వాత బాబా భాస్కర్ - శ్రీముఖిలు కలిసి చంద్రముఖిలో సీన్ చేశారు. ఈ సీన్ లో ఇద్దరు జీవించేశారు. చంద్రముఖిగా శ్రీముఖి పరకాయ ప్రవేశం చేయగా - రజనీకాంత్ గా బాబా నటిస్తూ ఫుల్ కామెడీ చేశారు. అలాగే పునర్నవి - రాహుల్ కు ఖుషి సినిమాలోని నడుము సీన్ ఇచ్చారు. ఈ సీనులో ఈ ఇద్దరు నిజంగానే ఇంటిలో జరిగిన సంఘటనలు మీద వాగ్వాదం చేశారు.


ఇక చివరికి వరుణ్-వితిక మధ్య ఎఫ్2 సినిమాలో సీన్ ఇచ్చారు. వెంకటేష్ గా వరుణ్ - తమన్నా గా వితిక  జీవించారు. ఈ విధంగా అందరూ సూపర్ పర్ఫార్మన్స్ చేయగా ఎక్కువ మార్కులు వచ్చిన బాబా భాస్కర్-శ్రీముఖి విజేతలుగా నిలిచినట్లు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: