శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్గౌతమ్లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
'మా స్టూడెంట్స్ పవరేంటో తెలిపేదే సేన'. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్, టైటిల్ సాంగ్ను మెగాబ్రదర్ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్: శిరీష్రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
'హలో మిత్రమా......సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెయ్, యుద్ధం చెయ్, యుద్ధం చెయ్రా..' అంటూ సాగే ఈ పాటలో ఇండియన్ క్రికెట్ టీమ్ డ్రెస్తో, ఆర్మీ యూనిఫాంలో ఉన్న యంగ్స్టర్స్ కనిపిస్తారు. అలాగే మన జాతీయ జెండాను కూడా ప్రొజెక్ట్ చేయడంతో ఈ పాట ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తోంది.
దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ''శివ మహాతేజ ఫిలింస్ బేనర్లో నిర్మించిన 'జైసేన' ఫస్ట్ సాంగ్, టైటిల్ సాంగ్ మా అన్నయ్య నాగబాబుగారి చేతులమీదుగా రిలీజ్ చేశాం. మేం అంతా బాగుండాలని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చిరంజీవిగారు, నాగబాబుగారి బ్లెసింగ్స్ ఉన్నాయి.
నా సినిమా ఫస్ట్ సాంగ్ అన్నయ్య చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో హార్ట్ఫుల్గా అన్నయ్య బ్లెసింగ్స్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్ 2 పవర్స్టార్ పవన్కల్యాణ్గారి పుట్టినరోజు. ఈ విధంగా మాకు కలిసొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీ వినాయకచవితి. పవర్స్టార్ పవన్కల్యాణ్గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శ్రీకాంత్, సునీల్, తారక్, కార్తికేయ, హరీష్, ప్రవీణ్, మా తోటి ఫ్రెండ్స్ శిరీష్, శ్రీను మేమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.