టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అలాంటి సమయంలో ప్రముఖ విప్లవ దర్శకులు టి. కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా తొలివలపు సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడంతో కెరీర్ కాపాడుకోవడానికి విలన్ గా నటించడానికి సిద్ద పడ్డాడు.  జయం, వర్షం, నిజం సినిమాల్లో విలన్ గా నటించాడు. తర్వాత మళ్ళీ హీరోగా నిలదొక్కుకున్నాడు.

రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం అతను కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలు.  గత కొంత కాలంగా గోపిచంద్ కి ఏ ఒక్క సినిమా కలిసి రావడంలేదు. జిల్, సౌఖ్యం, ఆక్సీజన్, పంతం ఇలా వరుసగా డిజాస్టర్ అయ్యాయి. చాలా గ్యాప్ తీసుకొని తమిళంలో ఫ్యామిలీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ సినిమాలో నటిస్తున్నాడు.  గత కొంత కాలంగా వరుస పరాజయాలతో ఢీలా పడ్డ యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్ తమిళ కొత్త దర్శకుడుతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు.

కోలీవుడ్ ఫేమ్ తిరుని తెలుగుకు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై 'చాణక్య' అనే స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గోపీచంద్.   ఇప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపీచంద్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ రోజు వినాయకచవితి సందర్భంగా సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ గన్ పట్టుకొని కాలుస్తుండగా.. పైన విమానాలు సెటప్ మొత్తం భారీగానే కనిపిస్తోంది. కనీసం ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ కనిపించనుంది. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.  ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పాటల చిత్రీకరణ ఇటలీలో మిలాన్ లో జరుగుతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ సందిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: