అక్కినేని నాగర్జున వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా అఖిల్ కష్టలు అన్ని ఇన్ని కావు. ఒక్క విజయం కోరకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మొదటి సినిమా "అఖిల్" ను మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. యక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన " అఖిల్" సినిమా డిజస్టర్ గా మిగిలింది.రెండవ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించాడు ఆ సినిమా కూడా నిరాశపరిచింది .మూడవ సారి "మిస్టర్ మజ్ను"లో ప్లే బాయ్ గా వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ కి విజయాన్ని అందించలేదు.

ప్రస్తుతం అఖిల్ బోమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది .ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు.ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టాలేదు.ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా వెతుకుతున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, రష్మిక మందన , పూజా హెగ్ద్ ల పేర్లు వచ్చాయి కానీ ఎవరు ఇంకా సెట్ అవ్వలేదు.

అఖిల్  5వ సినిమా షూటింగ్ పూర్తవ్వకముందే ,తన 6వ సినిమాని లైన్ లో పెట్టాడు అ! మరియు కల్కి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమా ప్రశాంత్ ను క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నడు. ప్రశాంత్  దర్శకత్వం వహించిన అ! సినిమా కి మేకప్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాలలో నేషనల్ అవార్డు వచ్చింది.రీసెంట్ గా వచ్చిన కల్కి కూడా మంచి విజయం సాధించింది. అఖిల్ క్రైమ్ థ్రిల్లర్ చేయడం ఇదే మొదటి సారి. ఈ సినిమాలో హీరీయిన్ గా "బ్రోచేవారెనరురా" సినిమా తో హిట్ అందుకున్న  నివేదాథానస్ ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: