అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్పై రూపొందిన థ్రిల్లర్ `ఎవరు`. వెంకట్ రామ్జీ దర్శకుడు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా నాలుగో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
నవీన్ చంద్ర మాట్లాడుతూ, అరవిందసమేత` చిత్రం తర్వాత నన్ను అందరూ బాల్ రెడ్డి అని పిలిచారు.
ఈ `ఎవరు` సినిమా తర్వాత అందరూ అశోక్ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. నటీనటుల గురించే కాదు.. ప్రతి ఒక క్రాఫ్ట్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మా సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. మరోసారి సినిమాను చూసి థ్రిల్ అవండి. చాలా కాలం ముందు మాట్లాడిన నా స్నేహితులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు`` అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - ``మంచి టీమ్ వర్క్ కలిసి ఇంత దూరం ట్రావెల్ చేశాం. ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరు సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం.
త్వరలోనే మేజర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాను. శేష్తో కలిసి ఆ సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది`` అన్నారు. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసుల మాట్లాడుతూ - ``అరకులో ఒక థియేటర్ ఉంది. అందులోనూ `ఎవరు` సినిమానే రన్ అవుతుంది. అక్కడ నుండి సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది`` అన్నారు. అడవి శేష్ కి ఇండస్ట్రీలో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. పోను పోను ఎన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిద్దాం.